సూర్యోదయ సంస్థ సేవా స్ఫూర్తి – పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్ల పంపిణీ

0
434

కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు ప్రభుత్వ హైస్కూల్లో సూర్యోదయ సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న 93 మంది విద్యార్థులకు పరీక్షా కిట్లు పంపిణీ చేశారు. సుర్ల నాగ రమణ – నాగమణి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు కె. సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనవ్వకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. విద్య ద్వారానే జీవితంలో విజయాన్ని సాధించవచ్చని వారికి ప్రేరణ ఇచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న సూర్యోదయ సంస్థ ప్రతినిధులు విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో భద్రరావు, సూర్యోదయ సంస్థ సెక్రటరీ రొంగల అర్జున్, వర్మ నాయుడు, ప్రసాద్, సురేష్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అవసరమైన పరీక్షా సామగ్రిని అందజేసి వారిని ప్రోత్సహించారు.

Search
Categories
Read More
Nagaland
Assam Rifles Public School Hosts Friendly Football Match in Medziphem |
Assam Rifles Public School, Medziphema, organized a friendly football match with SFS Higher...
By Pooja Patil 2025-09-16 06:48:20 0 176
Andhra Pradesh
రూ.32,52,064 సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. - కావలి నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది. - కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. - కార్యకర్తలకు ప్రశంసా పత్రం అందజేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
31 మంది లబ్ధిదారులకు సంబందించిన రూ.32,52,064 చెక్కులను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి...
By Ratna Sekhar 2026-03-11 07:08:32 0 212
Andhra Pradesh
పుంగనూరు: వైసిపి స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా హేమచంద్ర
వైసిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, శుక్రవారం చిత్తూరు జిల్లా, పుంగనూరు...
By Kothuru Murali 2026-02-21 08:31:43 0 107
Andhra Pradesh
వేసవిలో ఈ జాగ్రత్తలు పాటించాలి: VZM DMHO
వేసవి నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి...
By Boiena Rajesh 2026-03-05 08:13:06 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com