ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మేయర్ : ధర్ని మధుకర్

0
121

మంచిర్యాల : ఈశ్వర్ ప్రసాద్ స్మరక ఉమ్మడి ఆదిలాబాద్ వాలీబాల్ టోర్నమెంట్ ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల నలుమూల నుండి 32 టీములు పాల్గొనడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులకు భోజన సదుపాయాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమకూర్చడం జరిగింది, మొదటి బహుమతి 20,000 /- స్వరూప హాస్పిటల్ మంచిర్యాల, రెండవ బహుమతి 15,000/- ట్రినిటీ హైస్కూల్ మంచిర్యాల, మూడో బహుమతి 10,000/- నారాయణ సర్జికల్ హాస్పిటల్ మంచిర్యాల, నాలుగో బహుమతి 5,000/- వంశీ బిల్డర్స్ మంచిర్యాల లు సమకూర్చడం జరిగింది.

ఈ టోర్నమెంట్ ను ఉద్దేశించి మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని క్రీడలను ప్రోత్సహిస్తుంది ప్రత్యేక క్రీడా పాలసీని తీసుకువచ్చింది దీని ద్వారా రాష్ట్రంలో అన్ని క్రీడలలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడానికి వీలవుతుందని అదేవిధంగా పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి మంచిర్యాల సాయి కుంటలో స్టేడియం నిర్మాణానికి గాను 14 ఎకరాల స్థలాన్ని కేటాయించి అంతర్జాతీయ స్థాయిలో అన్ని క్రీడాంశాలకు సంబంధించి క్రీడా వసతులతో ప్రత్యేక శ్రద్ధతో అతి త్వరలో ఈ స్టేడియంలో మంచిర్యాల ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి రావుల రామ్మోహన్, ఉపాధ్యక్షులు బైరగొని సిద్దయ్య గౌడ్, ట్రెజరర్ గాజుల శ్రీనివాస్, జాతీయ వాలీబాల్ క్రీడాకారులు లక్షట్టి గురవయ్య, చిందం శ్రీనివాస్ సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత లక్షెట్టి లక్ష్మీనారాయణ, గడియార మురళి, సల్కాపురం రఘు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
మామూనూర్ ఎయిర్పోర్ట్ గ్రీన్ సిగ్నల్
వరంగల్ మామూనూర్ ఎయిర్పోర్ట్  పునరుద్దరణ పనులు వేగంగా సాగుతున్నాయి శనివారం ఏ ఏ ఐ హైదరాబాద్ జి...
By CM_ Krishna 2025-12-28 06:03:41 0 248
Andhra Pradesh
అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం గద్దె రామ్మోహన్
*అర్హులైన ప్రతి ఒక్కరికి ఫించన్లు, ఇళ్ళ స్థలాలు అందజేస్తాం* *ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి...
By Rajini Kumari 2026-04-24 13:07:01 0 129
Telangana
మాంజా ఎందుకంత డేంజర్? దేనితో తయారు చేస్తారు?
కైట్స్ పోటీల్లో ప్రత్యర్థి పతంగి దారాన్ని కట్ చేయడానికి చైనా మాంజాను షార్ప్ గా తయారు చేస్తారు....
By Mitappaly Shiavji 2025-12-27 06:40:08 0 436
Andhra Pradesh
మదనపల్లె నేత తులసికి రాష్ట్ర TDP కార్యదర్శి పదవి.
మదనపల్లె మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పచ్చిపాల తులసిని రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా అధిష్ఠానం బుధవారం...
By Pagadala Venkateswar 2026-04-16 03:26:22 0 89
Andhra Pradesh
మదనపల్లి: బాలిక అదృశ్యం – తల్లిదండ్రుల ఫిర్యాదు.
మదనపల్లిలో సోమవారం ఏడేళ్ల బాలిక రుచిక ప్రియా అదృశ్యమైంది. నీరుగట్టుపల్లిలో నివాసం ఉంటున్న...
By Pagadala Venkateswar 2026-02-17 05:15:09 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com