ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మేయర్ : ధర్ని మధుకర్

0
176

మంచిర్యాల : ఈశ్వర్ ప్రసాద్ స్మరక ఉమ్మడి ఆదిలాబాద్ వాలీబాల్ టోర్నమెంట్ ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల నలుమూల నుండి 32 టీములు పాల్గొనడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులకు భోజన సదుపాయాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమకూర్చడం జరిగింది, మొదటి బహుమతి 20,000 /- స్వరూప హాస్పిటల్ మంచిర్యాల, రెండవ బహుమతి 15,000/- ట్రినిటీ హైస్కూల్ మంచిర్యాల, మూడో బహుమతి 10,000/- నారాయణ సర్జికల్ హాస్పిటల్ మంచిర్యాల, నాలుగో బహుమతి 5,000/- వంశీ బిల్డర్స్ మంచిర్యాల లు సమకూర్చడం జరిగింది.

ఈ టోర్నమెంట్ ను ఉద్దేశించి మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని క్రీడలను ప్రోత్సహిస్తుంది ప్రత్యేక క్రీడా పాలసీని తీసుకువచ్చింది దీని ద్వారా రాష్ట్రంలో అన్ని క్రీడలలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడానికి వీలవుతుందని అదేవిధంగా పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి మంచిర్యాల సాయి కుంటలో స్టేడియం నిర్మాణానికి గాను 14 ఎకరాల స్థలాన్ని కేటాయించి అంతర్జాతీయ స్థాయిలో అన్ని క్రీడాంశాలకు సంబంధించి క్రీడా వసతులతో ప్రత్యేక శ్రద్ధతో అతి త్వరలో ఈ స్టేడియంలో మంచిర్యాల ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి రావుల రామ్మోహన్, ఉపాధ్యక్షులు బైరగొని సిద్దయ్య గౌడ్, ట్రెజరర్ గాజుల శ్రీనివాస్, జాతీయ వాలీబాల్ క్రీడాకారులు లక్షట్టి గురవయ్య, చిందం శ్రీనివాస్ సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత లక్షెట్టి లక్ష్మీనారాయణ, గడియార మురళి, సల్కాపురం రఘు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
యోగాతో ఆరోగ్యం- ఆంధ్ర తో అభివృద్ధి 🧘‍♂️
నమస్కారం మిత్రులారా 🙏 "యోగాతో ఆరోగ్యం - ఆంధ్రతో అభివృద్ధి" 🧘‍♂️ ఈరోజు మా తంగిరాలపల్లి...
By Chennaiah Kati 2026-06-21 11:03:42 0 70
Telangana
మేడారం వెళ్తుండగా అదుపుతప్పి వాహనం బోల్తా
బుధవారం ములుగు జిల్లా తడ్వాయి మండల కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం జిల్లా...
By Prashanth Goindla 2026-02-04 06:09:46 0 446
Andhra Pradesh
పుంగనూరు: అక్కడ చేరాలంటే ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోండి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు సంవత్సరాల కోర్సులో చేరాలనుకునే...
By Kothuru Murali 2026-05-07 12:05:52 0 99
Andhra Pradesh
విజయవాడ పివిపి మాల్ రోడ్డు విస్తరణ మీ అభిప్రాయాలు తెలపండి
విజయవాడ నగరపాలక సంస్థ  24-01-2026        *పివిపి మాల్ రోడ్ విస్తరణ...
By Rajini Kumari 2026-01-25 11:15:19 0 202
Andhra Pradesh
ACB Raids: ఆఫీస్‌ సబార్డినేట్ ఇంట్లో రూ.50 కోట్ల ఆస్తులు.. విస్తుపోయిన ఏసీబీ అధికారులు.
Andhra ACB officials stunned by Rs 50 Crore Assets of Tirupati Office Subordinate Tirumalesh...
By Pagadala Venkateswar 2026-01-30 06:03:16 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com