తెలంగాణ రుచి- జాతీయ వేదికపై రికార్డు సృష్టి. |

0
129

హైదరాబాద్: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన వంటల పోటీ ‘మాస్టర్‌చెఫ్ ఇండియా’ సీజన్-10లో తెలంగాణకు చెందిన తల్లి, కూతుళ్ల జోడీ అద్భుత ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించింది.

మంచిర్యాల జిల్లాకు చెందిన రాచకొండ సాయిశ్రీ మరియు ఆమె తల్లి చందన ఈ పోటీలో రన్నరప్‌లుగా నిలిచి తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని చాటారు.

మాస్టర్‌చెఫ్ ఇండియా చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘జోడీ ఫార్మాట్’లో వీరిద్దరూ పాల్గొని దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. 

వేలాది మంది పోటీ పడిన ఈ సీజన్‌లో సాయి శ్రీ, చందన తమ వంటల నైపుణ్యంతో అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్–12 మరియు టాప్–5 దశలను విజయవంతంగా దాటారు.

అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్ పోరులో, ఈ తల్లి–కూతుళ్ల జోడీ తమదైన శైలిలో వంటలను రుచి చూపించి టాప్–2లో స్థానం సంపాదించుకున్నారు.

త్రుటిలో టైటిల్‌ను చేజార్చుకున్నప్పటికీ, దేశంలోనే అతిపెద్ద కుకరీ షోలో రన్నరప్‌లుగా నిలవడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక చిన్న జిల్లా నుంచి వచ్చి జాతీయ వేదికపై తెలంగాణ రుచులను, తమ ప్రతిభను చాటిన సాయిశ్రీ మరియు చందనలను పలువురు ప్రముఖులు అభినందించారు.

వీరి విజయం ఎంతో మంది ఔత్సాహిక వంట నిపుణులకు స్ఫూర్తిదాయకమని వారన్నారు 

#sidhumaroji

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో 15000 మంది తిలకించేలా రిపబ్లిక్ డే.
మదనపల్లెలో 77వ రిపబ్లిక్ వేడుకలను సోమవారం బీటీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి...
By Pagadala Venkateswar 2026-01-25 12:28:14 0 134
Andhra Pradesh
ఉచిత క్యాన్సర్స్ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే !!
కర్నూలు: నంద్యాల : డోన్ ఈ రోజు డోన్ పట్టణంలోని క్లబ్ హౌస్ ప్రాంగణంలో డోన్ శాసనసభ్యులు గౌరవనీయులు...
By Hari Krishna 2026-01-12 07:36:34 0 155
Andhra Pradesh
ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తాం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం లో మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి...
By Benguluri Madhubabu 2026-03-10 13:31:55 0 131
Tripura
CBI Raids in Tripura Linked to Nagaland Varsity Graft Case
The CBI has launched raids in Agartala, along with locations in Nagaland and Assam, in connection...
By Bharat Aawaz 2025-07-17 07:46:26 0 1K
Telangana
సింగరేణి ఉద్యోగుల సంక్షేమనికి మరో కీలక ముందడుగు : సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి
సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌తో కీలక...
By Avunoori Mahesh 2026-04-29 14:07:25 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com