చీరాలలో అంగన్వాడీల నిరసన...

0
235

చీరాల: సీఐటీయూ ఆధ్వర్యంలో గడియారస్థంభం సెంటర్‌లో ఆందోళన
బాపట్ల జిల్లా చీరాల గడియారస్థంభం సెంటర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో తమపై అన్యాయాలు జరిగాయని, అప్పట్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమకు అండగా నిలిచి పలు హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం తమకు కనీస వేతనంగా రూ.26,000 ఇవ్వాలని ప్రధాన డిమాండ్‌గా కోరారు.
తమ సమస్యల పరిష్కారం కోసం నిన్న విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్న సమయంలో అర్ధరాత్రి వేళ పోలీసు సిబ్బంది ధర్నా శిబిరంపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకోవడం అమానుష చర్యగా భావిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు వసంతరావు, బాబూరావు, లింగం జయరాజు తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు: వైసీపీ మహిళా నేత నాగమణి ఆరోపణ
కాకినాడ రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని వైసీపీ మహిళా విభాగం...
By Ratna Sekhar 2026-02-19 18:49:04 0 491
Andhra Pradesh
జోగి రమేష్ గారికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు
*శ్రీ జోగి రమేష్ గారికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు*    నకిలీ మద్యం కేసులో అక్రమంగా...
By Rajini Kumari 2026-01-20 10:45:12 0 174
Andhra Pradesh
పుంగనూరు: అదుపుతప్పి పొలాల్లోకి వెళ్లిన వాహనం
పుంగనూరు పరిధిలో శుక్రవారం రోజున ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి ముల్బాగల్ కు వెళ్లే...
By Kothuru Murali 2026-05-22 14:22:02 0 97
Andhra Pradesh
రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు.. ఒక్కరోజే రూ.2,950 కోట్లు విడుదల.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భారీ ఊరట కల్పించింది. ఎన్నో...
By Pagadala Venkateswar 2026-04-10 06:02:53 0 105
Telangana
డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్
కంటోన్మెంట్ వార్డు 6, బాపూజి నగర్ సెంటర్ పాయింట్ అడ్డా వద్ద డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను...
By Sidhu Maroju 2025-06-13 14:03:01 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com