రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు.. ఒక్కరోజే రూ.2,950 కోట్లు విడుదల.

0
100

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భారీ ఊరట కల్పించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి బకాయిలను విడుదల చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నిన్న ఒక్కరోజే ఏకంగా రూ.2,950 కోట్లను విడుదల చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, సరెండర్ లీవ్‌ బిల్లుల కోసం ఈ నిధులను కేటాయించగా, వాటిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

 

ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రక్రియకు మార్గం సుగమమైంది. సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో ఆర్థిక శాఖ, నిధుల లభ్యత ఆధారంగా ఈ చెల్లింపులను పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వం మొత్తం మీద రూ.7,059 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులను దశలవారీగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఉద్యోగులే కాకుండా ప్రభుత్వానికి మెటీరియల్ సరఫరా చేసిన చిన్న కాంట్రాక్టర్లకు కూడా ప్రాధాన్యమిస్తూ రూ.614 కోట్ల బిల్లులను ఇప్పటికే చెల్లించింది.

 

పెండింగ్ బకాయిలు విడుదల

తాజా చెల్లింపులకు ముందు కూడా ప్రభుత్వం పలు బకాయిలను క్లియర్ చేసింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) బకాయిల కింద రూ.1,848 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే, గ్రూప్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కింద 4,793 మందికి రూ.76 కోట్లు, పోలీసు శాఖకు సంబంధించిన అదనపు సరెండర్‌ లీవుల కోసం రూ.223 కోట్లు విడుదలయ్యాయి. మొత్తం మీద ప్రభుత్వం ఇంకా గ్రాట్యుటీ బకాయిలు రూ.3,411 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్ కింద రూ.1,800 కోట్లు చెల్లించాల్సి ఉంది.

 

పోలీసులకు సరెండర్ లీవ్ బిల్లులు

ప్రస్తుతం సర్వీసులో ఉన్న పోలీసు ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ప్రభుత్వం వరుసగా బకాయిలు విడుదల చేస్తుండటంతో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ దీర్ఘకాల నిరీక్షణకు తెరపడిందని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వారు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Search
Categories
Read More
Telangana
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువైనా ట్రాఫిక్ చలాన్లు.|
హైదరాబాద్ : ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో రూ.239.37 కోట్ల ట్రాఫిక్ చలాన్లు గత ఏడాది రూ.111.81 కోట్లు...
By Sidhu Maroju 2025-12-26 09:19:38 0 194
Andhra Pradesh
Nara Lokesh: శ్రీవారి లడ్డూ కల్తీపై పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో వెల్లడిస్తాం: నారా లోకేశ్.
    Nara Lokesh: శ్రీవారి లడ్డూ కల్తీపై పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో వెల్లడిస్తాం:...
By Pagadala Venkateswar 2026-02-23 07:05:25 0 138
Andhra Pradesh
గోవుల అక్రమ రవాణా భగ్నం
పోలవరం జిల్లా చింతూరు మండలంలోని లక్కవరం వై జంక్షన్ వద్ద మంగళవారం పోలీసుల వాహన తనిఖీలో కంటైనర్ ను...
By Shyamala Yadagiri 2026-03-18 03:28:05 0 285
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:43 0 38
Andhra Pradesh
శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానించిన మూలపల్లి గ్రామ ప్రజలు
రాయచోటి నియోజకవర్గం రాయచోటి మండలం మాధవరం గ్రామం మాలపల్లి లో ఈనెల 23వ తేదీన శ్రీ శివాలయం భూమి పూజ...
By Benguluri Madhubabu 2026-03-04 03:01:19 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com