వేట్లపాలెం పేలుడు బాధితులకు అండగా న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ

0
470

వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో గూడపర్తి మాదిగపేటకు చెందిన ఏడుగురు మృతి చెందడం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది. ఈ నేపథ్యంలో న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ తరఫున వైస్ ప్రెసిడెంట్ రత్న శేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

పేలుడు తీవ్రత కారణంగా పొలాల గట్ల వెంట చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను గుర్తించే ప్రక్రియలో అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. ఘటనాస్థలంలో ఉన్న గ్రామస్తులను ప్రోత్సహిస్తూ, సహాయక చర్యల్లో సమన్వయం కల్పించారు. జరిగిన పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు ప్రారంభించారు.

అనంతరం గూడపర్తి మాదిగపేటలోని మృతుల కుటుంబాలను పరామర్శించి, ఈ క్లిష్ట సమయంలో ధైర్యం కోల్పోవద్దని భరోసా ఇచ్చారు. సమాజం మొత్తం మీకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామ పెద్దలను కలిసి ఇలాంటి విషాద సమయంలో అందరూ కలిసికట్టుగా ఉండి ఒకరినొకరు బలపరుచుకోవాలని సందేశం ఇచ్చారు.

తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు.

విషాద సమయంలో మానవత్వంతో ముందుకు వచ్చి బాధితులకు తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com