శ్రీ బాల ఆర్యటమ్మ తల్లి తిరునాళ్ళు మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
శ్రీ బాల ఆరేటమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
దేవత మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు.
ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, 28.02.2026.
రెడ్డిగూడెం మండలం కొత్తనాగులూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బాల ఆరేటమ్మ తల్లి, శ్రీ గోపయ్య స్వామి, లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, శ్రీ అంకమ్మ తల్లి అమ్మవార్ల తిరునాళ్ల మహోత్సవములను ఈ నెల 26 నుంచి మార్చి 2 వరకు ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఈ తిరునాళ్ళ మహోత్సవంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి ఘనంగా స్వాగతం పలికారు. స్దానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz