శ్రీ బాల ఆర్యటమ్మ తల్లి తిరునాళ్ళు మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

0
96

శ్రీ బాల ఆరేటమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

దేవత మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు.

 

ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, 28.02.2026.

 

రెడ్డిగూడెం మండలం కొత్తనాగులూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బాల ఆరేటమ్మ తల్లి, శ్రీ గోపయ్య స్వామి, లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, శ్రీ అంకమ్మ తల్లి అమ్మవార్ల తిరునాళ్ల మహోత్సవములను ఈ నెల 26 నుంచి మార్చి 2 వరకు ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

 

ఈ తిరునాళ్ళ మహోత్సవంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

 

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి ఘనంగా స్వాగతం పలికారు. స్దానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Karnataka
తుంగభద్ర డ్యాం సమస్యలు: నీటి నష్టం, సిల్టేషన్, మరియు పరిష్కారాల ఆలస్యం
సమస్య: తుంగభద్ర డ్యాం క్రెస్ట్ గేట్ దెబ్బతినడంతో భారీగా నీరు వృథా అవుతోంది.సామర్థ్యం తగ్గింపు:...
By Triveni Yarragadda 2025-08-11 06:20:45 0 606
Telangana
అల్వాల్ పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సమాజ రక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసుల సేవలను గుర్తించడం...
By Sidhu Maroju 2026-03-21 16:29:49 0 120
Andhra Pradesh
బాపట్ల జిల్లాలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు* *ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శక్తి స్టాల్*
ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 5 శక్తి బృందాలు నిరంతరం...
By Vadlamudi NagaVenkat 2026-03-08 15:37:45 0 751
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com