జై కిసాన్ స్కీమ్ విజేతలకు బహుమతులు పంపిణీ.
Posted 2026-02-28 06:19:22
0
135
మదనపల్లి: రామసముద్రం టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం జై కిసాన్ జంక్షన్ ఆధ్వర్యంలో లక్కీ డిప్ స్కీమ్ విజేతలకు బహుమతుల పంపిణీ జరిగింది. జువారి ఫామ్ హబ్ జోనల్ మేనేజర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు బహుమతులు అందజేశారు. దసరా, దీపావళి సందర్భంగా చేపట్టిన ఈ స్కీమ్లో రామసముద్రం జై కిసాన్ పరిధిలోని 36 మంది రైతులు ఎంపికయ్యారు. మొదటి బహుమతిగా లక్ష యాభై వేల రూపాయల విలువైన బంగారు నాణెం వూలపాడుకు చెందిన కేశవరెడ్డికి అందించారు. ఇతర విజేతలకు మొబైల్ ఫోన్లు, గోడ గడియారాలు, మిక్సీలు బహూకరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Prakasam district: బంజరు భూమిలో ఈ ఆనవాళ్లు.. ఆ పక్కనే ఉన్న నీటి కుంట వద్ద!!!!
పచ్చని పంటలు పండే పొలాల పక్కన ఉన్న బంజరు భూమిలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామంలో...
కోల్కతా వెళ్లిన నారా లోకేశ్... సీఎం సువేందు అధికారితో కీలక భేటీ.
కోల్కతా వెళ్లిన నారా లోకేశ్... సీఎం సువేందు అధికారితో కీలక భేటీ
Andhra...
మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు
మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు
మంచిర్యాలకు చెందిన ఎస్కే ఇమ్రాన్ కు భార్య చింతల...
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
గురువారం సాయంత్రం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పుంగనూరులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి...
ధాన్యం పై రాజకీయం అన్నదాతలకు అన్యాయం..!
తెలంగాణ : ధాన్యం అమ్మేందుకు అన్నదాత అష్ట కష్టాలు పడుతున్నాడు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య...