Justice Lisa Gill: ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ లీసా గిల్ నియామకానికి కొలీజియం గ్రీన్ సిగ్నల్!

0
146

Justice Lisa Gill: ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ లీసా గిల్ నియామకానికి కొలీజియం గ్రీన్ సిగ్నల్!

27-02-2026 Fri 12:03 | Andhra

AP High Court to Get Justice Lisa Gill as First Woman Chief Justice

కేంద్రానికి జస్టిస్ లీసా గిల్ పేరును సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

ప్రస్తుతం పంజాబ్ - హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ లీసా

మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్ పేరు సిఫారసు

 

ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) సరికొత్త చరిత్రకు సిద్ధమవుతోంది. ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆమె పంజాబ్ - హర్యానా హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్రం నుంచి అధికారిక ముద్ర పడడమే తరువాయి, ఆమె అమరావతిలో బాధ్యతలు చేపట్టనున్నారు.

 

 

 

సాధారణంగా ఒక ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తర్వాత కొత్తవారి నియామకం జరిగేది. కానీ, ఈసారి సుప్రీంకోర్టు కొలీజియం తన పనితీరులో కీలక మార్పు తెచ్చింది. ప్రస్తుత సీజేలు రిటైర్ కావడానికి రెండు నెలల ముందే వారి వారసుల పేర్లను కేంద్రానికి పంపిస్తోంది. న్యాయపాలనలో ఎక్కడా విరామం లేకుండా చూడటం, పరిపాలనాపరమైన జాప్యాన్ని నివారించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణం.

 

 

 

మరోవైపు, మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారిని కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ ధర్మాధికారి ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గారి ముందస్తు జయంతి ఉత్సవాలు
పుంగనూరు మండలం బండ్లపల్లి పంచాయతీ నల్లూరు పల్లి గ్రామంలో ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 9.30 గంటలకు...
By Kothuru Murali 2026-04-11 06:23:46 0 106
Andhra Pradesh
గల్ఫ్ వలసదారుడు విదేశీ కార్మికుల క్షేమమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం లక్ష్యం
ప్ర‌వాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీ అద్భుత సేవ‌లు - గల్ఫ్ వలసదారులు, విదేశీ...
By Rajini Kumari 2026-05-20 12:27:43 0 120
Andhra Pradesh
జనవరి 3న వ్యవసాయ శాఖ మంత్రి కర్నూలు జిల్లాలో పర్యటన :
కర్నూలు : జనవరి 3 వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఉల్లి పంట...
By Hari Krishna 2025-12-31 11:05:33 0 354
Telangana
నిజామాబాద్
నగరంలోని మార్వాడి గల్లీలో మంచినీటి పైప్ లైన్ లీకేజీ కావడంతో కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్...
By Sadaq Sadaq 2026-05-21 13:00:06 0 94
SURAKSHA
Vadarevu Vinay Chand IAS: Transforming Governance with Vision
A distinguished Andhra Pradesh cadre IAS officer known for his visionary leadership, efficient...
By Lokeshwari Panthadi 2026-07-16 06:52:04 0 50
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com