Justice Lisa Gill: ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ లీసా గిల్ నియామకానికి కొలీజియం గ్రీన్ సిగ్నల్!

0
71

Justice Lisa Gill: ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ లీసా గిల్ నియామకానికి కొలీజియం గ్రీన్ సిగ్నల్!

27-02-2026 Fri 12:03 | Andhra

AP High Court to Get Justice Lisa Gill as First Woman Chief Justice

కేంద్రానికి జస్టిస్ లీసా గిల్ పేరును సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

ప్రస్తుతం పంజాబ్ - హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ లీసా

మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్ పేరు సిఫారసు

 

ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) సరికొత్త చరిత్రకు సిద్ధమవుతోంది. ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆమె పంజాబ్ - హర్యానా హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్రం నుంచి అధికారిక ముద్ర పడడమే తరువాయి, ఆమె అమరావతిలో బాధ్యతలు చేపట్టనున్నారు.

 

 

 

సాధారణంగా ఒక ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తర్వాత కొత్తవారి నియామకం జరిగేది. కానీ, ఈసారి సుప్రీంకోర్టు కొలీజియం తన పనితీరులో కీలక మార్పు తెచ్చింది. ప్రస్తుత సీజేలు రిటైర్ కావడానికి రెండు నెలల ముందే వారి వారసుల పేర్లను కేంద్రానికి పంపిస్తోంది. న్యాయపాలనలో ఎక్కడా విరామం లేకుండా చూడటం, పరిపాలనాపరమైన జాప్యాన్ని నివారించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణం.

 

 

 

మరోవైపు, మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారిని కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ ధర్మాధికారి ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు.

Search
Categories
Read More
Telangana
మరిపెడ సంక్రాతి వేడుకలో.. పాల్గొన్న... డిప్యూటీ స్పీకర్
*మరిపెడ మండలపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలలో పాల్గొని, ముగ్గుల పోటీలను...
By CM_ Krishna 2026-01-14 17:41:40 0 282
Andhra Pradesh
2025లో ఏపీలో క్రైమ్ రేట్ తగ్గిందా? పెరిగిందా? వివరాలు డీజీపీ మాటల్లో..
2025 సంవత్సరానికి వార్షిక నేరాల నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విడుదల చేశారు. గత...
By John Baji 2025-12-29 12:51:04 0 129
Telangana
నిజాంపేట్ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు
నిజాంపేట్ సర్కిల్ లోని పలు కాలనీలలో వెలసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు...
By Ponnala Srinivasrao 2026-03-18 04:19:26 0 227
Andhra Pradesh
పుంగనూరు: అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి.
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గురువారం అధికారుల నిర్లక్ష్య వైఖరిని...
By Kothuru Murali 2026-01-30 04:35:00 0 138
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com