పెద్ద వడ్లమూడి గ్రామంలో ముగ్గురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

0
122

*మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు*

 

*పెద్దవడ్లపూడి గ్రామంలో 3 గురికి సీఎం రిలీఫ్ ఫండ్ రూ 2,23,923 ల చెక్కులు పంపిణీ*

 

మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సిఎంఆర్ చెక్కులను మంత్రి నారా లోకేష్ చొరవతో టీడీపీ నాయకులు పంపిణీ చేశారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ సహాయం అందిస్తున్నట్లు టిడిపి నాయకులు తెలిపారు. వైద్య చికిత్సలు, ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులైన జవ్వాది సాంబశివరావు కు రూ 65,536/-, చిట్టిబొమ్మ అనురాధ కు రూ 1,24,523/- వాక శ్రీనివాసరావు కు రూ 33,864 ల చెక్కులను ముగ్గురికి మొత్తం రూ 2,23,923 చెక్కులను టిడిపి నాయకులు వాటి నివాసాలకు వెళ్లి అందజేశారు..సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న ఈ ఆర్థిక సహాయం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతోందని టీడీపీ నాయకులు తెలిపారు. చెక్కులు అందుకున్న బాధిత కుటుంబం సభ్యులు మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.చెక్కును అందజేసినవారి లో మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్,మాదల రమేష్ బాబు,చిట్టి బొమ్మ వెంకటేశ్వరరావు, నడపన దుర్గారావు, కనపాల సాగర్,యోమినేని సుధాకర్, ఉల్లంగీ శ్రీనివాసరావు,వాకా బాజీ, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ 50వేల రూపాయలు విరాళం ఇచ్చారు.
శ్రీశ్రీశ్రీ మాతా బంగారం అవ్వ దేవి దేవాలయం నూతన గోపుర కలశం మరియు ముఖద్వారం ప్రతిష్ట మరియు...
By Boya Dasthagiri 2026-03-28 08:23:17 0 205
Bharat Aawaz
మీడియా మూగబోయిందా?
https://youtu.be/AkEiqPBhFko
By Hazu MD. 2025-08-21 04:25:13 0 1K
Telangana
దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : ఎమ్మెల్యే కె.పి వివేకానంద్.|
*_నేటి తరానికి దీక్షా దివాస్  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్...
By Sidhu Maroju 2025-11-26 07:49:05 0 118
Andhra Pradesh
సీఎం చంద్రబాబును కలిసిన గద్దె రామ్మోహన్ ఎంపీ కేసినేని
*విజ‌య‌వాడ‌* *25-12-2025*   *సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్,...
By Rajini Kumari 2025-12-25 07:43:31 0 170
Telangana
నిజామాబాద్: తొలిరోజు 51 మంది గర్హజారి
జిల్లాలో పధోతరగతి పరీక్షలూ ప్రశాంతాంగ ప్రారమ్భమయ్యాయ. తొలి రోజుతెలుగు పరీక్షకు-24-404 మాంధి...
By Sadaq Sadaq 2026-03-14 12:24:55 0 142
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com