పెద్ద వడ్లమూడి గ్రామంలో ముగ్గురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

0
195

*మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు*

 

*పెద్దవడ్లపూడి గ్రామంలో 3 గురికి సీఎం రిలీఫ్ ఫండ్ రూ 2,23,923 ల చెక్కులు పంపిణీ*

 

మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సిఎంఆర్ చెక్కులను మంత్రి నారా లోకేష్ చొరవతో టీడీపీ నాయకులు పంపిణీ చేశారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ సహాయం అందిస్తున్నట్లు టిడిపి నాయకులు తెలిపారు. వైద్య చికిత్సలు, ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులైన జవ్వాది సాంబశివరావు కు రూ 65,536/-, చిట్టిబొమ్మ అనురాధ కు రూ 1,24,523/- వాక శ్రీనివాసరావు కు రూ 33,864 ల చెక్కులను ముగ్గురికి మొత్తం రూ 2,23,923 చెక్కులను టిడిపి నాయకులు వాటి నివాసాలకు వెళ్లి అందజేశారు..సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న ఈ ఆర్థిక సహాయం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతోందని టీడీపీ నాయకులు తెలిపారు. చెక్కులు అందుకున్న బాధిత కుటుంబం సభ్యులు మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.చెక్కును అందజేసినవారి లో మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్,మాదల రమేష్ బాబు,చిట్టి బొమ్మ వెంకటేశ్వరరావు, నడపన దుర్గారావు, కనపాల సాగర్,యోమినేని సుధాకర్, ఉల్లంగీ శ్రీనివాసరావు,వాకా బాజీ, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోండి.. పద్మనాభరెడ్డి.
అన్నమయ్య జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, నార్లు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారని రైతు...
By Pagadala Venkateswar 2026-05-04 05:50:16 0 92
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ కష్టాలు
*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*   *ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ట్రాఫిక్ ట్రాఫిక్ డిసిపి...
By Rajini Kumari 2026-01-18 14:15:21 0 196
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పరామర్శించిన సుగవాసి ప్రసాద్ బాబు
*💛✌️ తరిగొండ రమేష్ గారిని పరామర్శించిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి...
By Benguluri Madhubabu 2026-07-19 15:01:01 0 38
Telangana
కొత్తపల్లి గ్రామ ప్రవేశ ద్వారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
  పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  నేడు పాలకుర్తి మండలంలోని కొత్తపల్లి...
By Avunoori Mahesh 2026-04-26 07:00:29 0 152
Andhra Pradesh
బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బి పి శ్రీదేవి!!
కర్నూలు : వార్షిక తనిఖీల్లో భాగంగా కర్నూలు పోస్ట్మాస్టర్ జనరల్ కార్యాలయం తనిఖీ చేసిన ఆంధ్రప్రదేశ్...
By Hari Krishna 2025-12-23 13:48:11 0 309
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com