పెద్ద వడ్లమూడి గ్రామంలో ముగ్గురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

0
193

*మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు*

 

*పెద్దవడ్లపూడి గ్రామంలో 3 గురికి సీఎం రిలీఫ్ ఫండ్ రూ 2,23,923 ల చెక్కులు పంపిణీ*

 

మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సిఎంఆర్ చెక్కులను మంత్రి నారా లోకేష్ చొరవతో టీడీపీ నాయకులు పంపిణీ చేశారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ సహాయం అందిస్తున్నట్లు టిడిపి నాయకులు తెలిపారు. వైద్య చికిత్సలు, ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులైన జవ్వాది సాంబశివరావు కు రూ 65,536/-, చిట్టిబొమ్మ అనురాధ కు రూ 1,24,523/- వాక శ్రీనివాసరావు కు రూ 33,864 ల చెక్కులను ముగ్గురికి మొత్తం రూ 2,23,923 చెక్కులను టిడిపి నాయకులు వాటి నివాసాలకు వెళ్లి అందజేశారు..సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న ఈ ఆర్థిక సహాయం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతోందని టీడీపీ నాయకులు తెలిపారు. చెక్కులు అందుకున్న బాధిత కుటుంబం సభ్యులు మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.చెక్కును అందజేసినవారి లో మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్,మాదల రమేష్ బాబు,చిట్టి బొమ్మ వెంకటేశ్వరరావు, నడపన దుర్గారావు, కనపాల సాగర్,యోమినేని సుధాకర్, ఉల్లంగీ శ్రీనివాసరావు,వాకా బాజీ, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి లోకేశ్.
Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి...
By Pagadala Venkateswar 2026-03-16 10:15:02 0 180
Andhra Pradesh
అన్నమయ్య ​జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా విజిబుల్ పోలీసింగ్: SP.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లావ్యాప్తంగా శనివారం 'విజిబుల్ పోలీసింగ్'...
By Pagadala Venkateswar 2026-03-15 03:57:07 0 152
Jammu & Kashmir
FIR Filed Against Army Officers in Kishtwar Case
Jammu & Kashmir Police have registered an FIR against a Colonel and a Major of the 17...
By Navya Sree 2026-06-27 07:49:53 0 122
Andhra Pradesh
ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సహకారంతో కొనుగోలు చేయాలి.
ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి, ఆర్టీసీ సిబ్బంది ద్వారా నిర్వహించేలా చర్యలు...
By Pagadala Venkateswar 2026-05-19 05:21:11 0 78
Telangana
మంచిర్యాల్: ముగిసిన ఉమ్మడి జిల్లాల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు
మంచిర్యాల్ క్లబ్ నిర్వహించిన ఉమ్మడి జిల్లాల బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు, సెలక్షన్ ముగి సాయి....
By Bonagiri RaviShankar 2026-05-24 23:03:30 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com