నృసింహుని ప్రసాదల పంపిణీ శ్రీకారం

0
142

*నృసింహుని బ్రహ్మోత్సవాల ప్రసాదాల పంపిణీకి శ్రీకారం...*

  ***************************

మంగళగిరి మిద్దె సెంటర్ శ్రీ ప్రపత్తి ఆంజనేయస్వామి వారి దేవస్థానం వద్ద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్థానిక మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం ఏర్పాటు చేశారు. శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాల వంటకాల తయారీ ప్రారంభించారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు పణిదపు శ్రీనివాసరావు మాట్లాడారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారి పెండ్లి కుమారుని ఉత్సవం రోజున ప్రారంభించి రథోత్సవం వరకు తొమ్మిది రోజులు పాటు స్వామివారి ఉత్సవ ఊరేగింపు మిద్దె సెంటర్ చేరుకున్న సమయంలో భక్తులకు ట్రస్ట్ ప్రసాదాలు పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు గాలి ప్రతాపరెడ్డి, జంజనం దినేష్, పణిదపు భాను ప్రసాద్, పంచల రామచంద్రరావు, దామర్ల వీరప్రసాద్, పణిదపు శోభన్, వెంకటేష్, అర్చక స్వామి దగ్గుపాటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Search
Categories
Read More
Telangana
మిస్టరీ డెత్ .... యువకుడు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనం...
By Nookapangu Manikanta 2026-05-16 05:25:21 0 185
Telangana
కాంగ్రెస్‌కు గుడ్‌బై , బీఆర్ఎస్‌లోకి ?మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా...
By Ponnala Srinivasrao 2026-03-23 09:04:40 0 186
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:46:09 0 477
Telangana
కరీంనగర్ : అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం : సిపి గౌష్ ఆలం
కరీంనగర్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు సిపి గౌష్అ లం తెలిపారు....
By Sunka Santhosh 2026-04-08 12:43:41 0 231
Andhra Pradesh
దొర్నిపాడు మండలం చాకరాజు వేముల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్‌గా వై. గోపాల్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఈరోజు పాల్గొనడం జరిగింది
దొర్నిపాడు మండలం చాకరాజు వేముల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్‌గా వై. గోపాల్...
By Chennaiah Kati 2026-07-10 07:43:19 1 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com