నృసింహుని ప్రసాదల పంపిణీ శ్రీకారం

0
108

*నృసింహుని బ్రహ్మోత్సవాల ప్రసాదాల పంపిణీకి శ్రీకారం...*

  ***************************

మంగళగిరి మిద్దె సెంటర్ శ్రీ ప్రపత్తి ఆంజనేయస్వామి వారి దేవస్థానం వద్ద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్థానిక మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం ఏర్పాటు చేశారు. శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాల వంటకాల తయారీ ప్రారంభించారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు పణిదపు శ్రీనివాసరావు మాట్లాడారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారి పెండ్లి కుమారుని ఉత్సవం రోజున ప్రారంభించి రథోత్సవం వరకు తొమ్మిది రోజులు పాటు స్వామివారి ఉత్సవ ఊరేగింపు మిద్దె సెంటర్ చేరుకున్న సమయంలో భక్తులకు ట్రస్ట్ ప్రసాదాలు పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు గాలి ప్రతాపరెడ్డి, జంజనం దినేష్, పణిదపు భాను ప్రసాద్, పంచల రామచంద్రరావు, దామర్ల వీరప్రసాద్, పణిదపు శోభన్, వెంకటేష్, అర్చక స్వామి దగ్గుపాటి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Search
Categories
Read More
Andhra Pradesh
మారనున్న కుప్పం ఆర్టీసీ బస్టాండ్ రూపురేఖలు: రూ.75 కోట్లతో ఆధునీకరణ
కుప్పం ఆర్టీసీ బస్టాండ్ మరియు డిపోను రూ.75 కోట్లతో అత్యాధునికంగా అభివృద్ధి చేస్తామని ఆర్టీసీ వైస్...
By Kothuru Murali 2026-04-15 07:16:34 0 86
Telangana
రెడ్డి శ్రీను ముదిరాజ్ గోకాఫసల్వాడ్
కోడంగల్ ను దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగ రోల్ మోడల్ గ తీర్చిదిద్దుతా   తెలంగాణలో 12,706...
By Vanmoj Suryamohan 2025-12-24 16:40:33 1 528
Andhra Pradesh
Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో కీలక భేటీ.
సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవనరుల అంశాలపై కేంద్ర...
By Pagadala Venkateswar 2026-02-10 09:44:17 0 116
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో ఓ మోస్తరుగా వర్షం
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారి, ఓ మోస్తరు వర్షం కురిసింది....
By Kothuru Murali 2026-05-01 11:40:58 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com