పాత ఇంటి యజమాని దాస్తీకం- మనోవేదనతో యువతి ఆత్మహత్య .|

1
356

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పాత ఇంటి యజమాని పెట్టిన మానసిక వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆల్వాల్  పోలీస్  స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

 

హస్మత్‌పేట్‌లోని మాలా బస్తీకి చెందిన షేక్ సాబర్ (46), పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య తబస్సుమ్ (62). వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. గత 21 ఏళ్లుగా హస్మత్‌పేట్‌లోని అబ్రహార్ మసీదు సమీపంలో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్న ఈ కుటుంబం, రెండు రోజుల క్రితమే మాలా బస్తీలోని కొత్త ఇంటికి మారింది.

 

ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో, తబస్సుమ్ పాత ఇంట్లో మిగిలిపోయిన బట్టలు, సామాన్లు శుభ్రం చేయడానికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంటి యజమాని మోటార్ పాడైందని, అడ్వాన్స్ డబ్బుల విషయంలో తనను తీవ్రంగా వేధిస్తున్నాడని, అంతేకాకుండా భర్త ఇంట్లో లేని సమయంలో తలుపులు కొట్టి లోపలికి వస్తూ ఇబ్బంది పెడుతున్నాడని ఆమె తన భర్తకు వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పంపింది.

 

యజమాని వేధింపుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన తబస్సుమ్, అదే రోజు సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఎవరూ లేని సమయంలో పాత ఇంటి వంటగదిలో ఇనుప పైపుకు చున్నీతో ఉరివేసుకుంది.

గమనించిన షేక్ యాకూబ్ అనే వ్యక్తి ఆమెను కిందికి దించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త షేక్ సాబర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

తన భార్య మరణానికి కారణమైన ఇంటి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం పోలీసులను కోరుతోంది..

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Telangana
చైన్ స్నాచర్ అరెస్ట్. రిమాండ్ కు తరలింపు.
   సికింద్రాబాద్/ సికింద్రాబాద్.   చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఘరానా దొంగను...
By Sidhu Maroju 2025-08-11 11:23:38 0 705
Andhra Pradesh
ఉచిత మెగా పశు వైద్య శిబిరం ను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు
ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని రైతు సోదరులు పశుపోషణ ద్వారా ఆర్థికంగా...
By Benguluri Madhubabu 2026-03-09 09:54:19 0 146
Andhra Pradesh
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి జన్మదినం సందర్భంగా వీరభద్ర స్వామి గుడిలో విశేష పూజలు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాయచోటి పట్టణం నందు...
By Benguluri Madhubabu 2026-03-20 11:36:02 0 173
Andhra Pradesh
మంత్రి కి ఘన స్వాగతం !!
కర్నూలు : పాణ్యం : కోడుమూరు :  నేడు కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట వ్యవసాయం,సహకార...
By Hari Krishna 2026-01-03 14:28:39 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com