చారిత్రాత్మక బొల్లారం స్టేషన్ కు మహర్దశ- ఎంపి చొరవతో నిలిచిన రాయలసీమ ఎక్స్ ప్రెస్.|

0
155

హైదరాబాద్ (బొల్లారం): మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని చారిత్రాత్మక బొల్లారం రైల్వే స్టేషన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బొల్లారం స్టేషన్‌లో రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (12793/12794) కు కల్పించిన తొలి నిలుపుదల (First Halt) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా.. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. "బొల్లారం రైల్వే స్టేషన్‌కు స్వాతంత్ర్యానికి పూర్వమే గొప్ప చరిత్ర ఉంది. దేశవ్యాప్తంగా ఆర్మీలో పనిచేసే సైనికుల రాకపోకలకు ఇది ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న స్టేషన్ ప్రస్తుతం కనీస సౌకర్యాలకు నోచుకోకపోవడం బాధాకరం" అని ఆవేదన వ్యక్తం చేశారు.

బొల్లారం స్టేషన్‌ను 'అమృత్ స్టేషన్' పథకం కింద అన్ని హంగులతో మోడల్ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దాలని తాము కేంద్ర రైల్వే శాఖను డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

 

 

 

సికింద్రాబాద్, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లు ప్రస్తుతం విపరీతమైన రద్దీతో (Congestion) ఇబ్బంది పడుతున్నాయని, నగరంలో రైళ్లను నిలిపేందుకు తగిన స్థలం లేక ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని ఎంపీ వివరించారు. ఈ రద్దీని తగ్గించడానికి బొల్లారం వంటి స్టేషన్లను ప్రత్యామ్నాయ టెర్మినల్స్‌గా అభివృద్ధి చేయడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

 

ఇదే క్రమంలో బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా సభ్యురాలు కరుణశ్రీ కందుకూరి, విశాఖ, నాగవళి, నగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలపై మరియు ప్లాట్‌ఫారమ్ సౌకర్యాలపై ఎంపీ గారికి వినతి పత్రాన్ని అందించారు.

 

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరైన సీఎం చంద్రబాబు... దిగ్గజ సంస్థలతో 7 కీలక ఒప్పందాలు.
Chandrababu Naidu: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరైన సీఎం చంద్రబాబు... దిగ్గజ సంస్థలతో 7...
By Pagadala Venkateswar 2026-02-20 11:46:07 0 88
Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ ల పొట్ట కొట్టింది.: ఎమ్మెల్యే తలసాని.|
సికింద్రాబాద్ :  తెలంగాణ వ్యాప్తంగా ఆటోడ్రైవర్ల జీవనం అగమ్య గోచరంగా మారిందని మాజీ...
By Sidhu Maroju 2025-10-27 08:09:50 0 204
Telangana
జ్యువెలరీ, ఎలక్ట్రానిక్ షాప్ ల యజమానులకు పోలీసుల హెచ్చరిక.|
హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నార్త్‌జోన్ డీసీపీ రష్మి పెరుమాల్,...
By Sidhu Maroju 2025-11-27 10:41:20 0 126
Andhra Pradesh
పుంగనూరులో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల...
By Kothuru Murali 2026-02-28 10:15:46 0 63
Telangana
కాంగ్రెస్ సోషల్ మీడియా నాపై తప్పుడు ప్రచారం చేస్తుంది.
 కాంగ్రెస్ సోషల్ మీడియా తన పై తప్పుడు ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ నాయకుడు రాజీవ్ సాగర్.....
By Sidhu Maroju 2025-06-13 11:43:36 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com