రబీ సాగుకు జిల్లాకు 1,250 టన్నుల యూరియా చేరిక

0
1K

రబీ సీజన్‌లో ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుధవారం 1,250 టన్నుల యూరియా కాకినాడ జిల్లాకు చేరిందని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. విజయ్ కుమార్ తెలిపారు. రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరో 500 టన్నుల యూరియా త్వరలోనే జిల్లాకు రానుందని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో ఇప్పటికే 4,924 టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు. అదనంగా 207 లీటర్ల నానో యూరియా కూడా అందుబాటులో ఉందని చెప్పారు.

జిల్లాలోని అన్ని మండలాల్లో పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు), రైతు సేవా కేంద్రాలు మరియు ప్రైవేటు డీలర్ల ద్వారా యూరియాను సరఫరా చేయనున్నట్లు వివరించారు. రైతులు అధికారిక కేంద్రాల ద్వారా మాత్రమే ఎరువులను కొనుగోలు చేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రబీ పంటల సాగులో అవసరమైన ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Search
Categories
Read More
International
War effect in india
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా మరియు ముఖ్యంగా భారతదేశంపై పడే ప్రభావాలు చాలా...
By G k Nookala 2026-03-01 08:01:18 0 133
Business & Finance
Tripura Rubber Industry Receives Fresh Growth Boost
Tripura has strengthened initiatives to promote value addition in the rubber industry by...
By Navya Sree 2026-07-06 07:01:42 0 72
Telangana
మంచిర్యాల్: తాటి చెట్టు పై పిడుగు
జిన్నారం మండలంలోని కలమడుగు గ్రామం శివారులో మంగళవారం ఈదురు గాలులు తో కూడిన వర్షం కురుస్తుండగా భారీ...
By Bonagiri RaviShankar 2026-05-27 03:59:02 0 213
Andhra Pradesh
Bandla Ganesh: బండ్ల గణేశ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్.
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్...
By Pagadala Venkateswar 2026-01-27 06:29:29 0 173
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ: రొంపిచర్ల లో ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాల ప్రజలు బుధవారం రొంపిచర్ల లో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా...
By Kothuru Murali 2026-03-20 06:07:46 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com