ప్రజలకు హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీ

0
53

బాపట్ల జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల డి.ఎస్.పి మోయిన్ సారథ్యంలో చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరిచేందుకు పోలీసులు హెల్మెట్ ధరించి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి జాతీయ రహదారి దాకా బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేనందున వల్లే ప్రమాదం సాత్తు వాహనాలు ఢీకొట్టడం వల్ల తలకు గాయాలై ప్రాణాలు పోతున్నాయని అన్నారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు నిలిచే అవకాశాలు ఉన్నాయని, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రజలు ఇబ్బందికరంగా భావిస్తున్నారని హెల్మెట్ నే ప్రాణానికి రక్షణ కవచమని ప్రజలు తెలుసుకోలేక పోతున్నారని వారు తెలియజేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని అందువల్ల ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడిపే ముందు వారికి ఒక కుటుంబం ఉందని ఆలోచించాలని నష్టం జరిగిపోతే కుటుంబం మొత్తం జీవితాంతం బాధపడాలని మద్యం సేవించి వాహనాలు నడుపు రాదని వారు కోరారు. మైనర్ డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి వస్తుందని ఎట్టి పరిస్థితుల్లోనూ మైన డ్రైవర్ని ప్రోత్సహించేది లేదని తల్లిదండ్రులపై కఠినమైన చర్యలు తీసుకుంటావని హెచ్చరించారు. కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com