0 Comments
0 Shares
53 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
సామర్లకోట శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగాసామర్లకోట ప్రసిద్ధి చెందిన శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తి వైభవం వెల్లివిరిసింది. రాత్రి లింగోద్భవ కాలంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించగా, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య పంచద్రవ్యాలతో స్వామికి మహాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా శివనామ స్మరణతో మార్మోగింది. రాత్రంతా భజనలు, ప్రత్యేక ఆరాధనలు కొనసాగాయి....0 Comments 0 Shares 52 Views 0 Reviews
-
సామర్లకోట: హై వోల్టేజ్ త్రీఫేజ్ పవర్ సరఫరా కట్సామర్లకోట పట్టణంలో హై వోల్టేజ్ కారణంగా విద్యుత్ పరికరాలు పలుచోట్ల భారీ నష్టం వాటిల్లింది. స్థానిక నివాసి వాకపల్లి ఇమ్మానుయేల్ ఇంట్లో పవర్ సరఫరా సంభవించడంతో ఫ్రిజ్, ఇన్వర్టర్ సహా ఇతర ఉపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. హై వోల్టేజ్ కారణంగా నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని బాధితులు, గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులను విజ్ఞప్తి చేశారు.0 Comments 0 Shares 53 Views 0 Reviews
-
కాకినాడలో రోడ్డు ప్రమాదం – చికిత్స పొందుతూ వ్యక్తి మృతిసామర్లకోట–కాకినాడ కెనాల్ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని కలిగించింది. వెంకటకృష్ణరాయపురం గ్రామానికి చెందిన తుమ్మల కొండలరావు ఈ ప్రమాదంలో మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం, కొండలరావు సోమవారం సాయంత్రం రహదారిపై ప్రయాణిస్తుండగా మాధవపట్నం సమీపంలో జేసీబీ వాహనం ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనను...0 Comments 0 Shares 61 Views 0 Reviews
-
లారీ ఢీకొని పోస్ట్మాస్టర్కు తీవ్ర గాయాలుసామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో గురువారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేట్లపాలెంలోని పెట్రోల్ బంకు సమీపంలో స్కూటీపై ప్రయాణిస్తున్న పోస్ట్మాస్టర్ మలకల సూర్యారావును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రజలు సూర్యారావును కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోందని...0 Comments 0 Shares 59 Views 0 Reviews
-
సామర్లకోటలో సహకార సంఘ ఉద్యోగుల నిరసన – డిమాండ్లు పరిష్కారం వరకు సమ్మె కొనసాగింపుసామర్లకోట : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సహకార సంఘ ఉద్యోగుల సమ్మెలో భాగంగా సామర్లకోటలో కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. గురువారం సామర్లకోట బ్రాంచి కార్యాలయం ఎదుట ఉద్యోగులు సమావేశమై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఉద్యోగులు మాట్లాడుతూ, తమ పెండింగ్ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. వేతనాలు, పదోన్నతులు, సేవా నియమావళి సవరణలు వంటి అంశాలపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మెను...0 Comments 0 Shares 15 Views 0 Reviews