సామర్లకోట: వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు
సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పరిశ్రమ ఘోర ప్రమాదంలో 21 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో పరిశ్రమ యజమాని అడబాల శ్రీనివాసరావు సహా పలువురు పేద కార్మికులు ఉన్నారు. ఈ ఘటనతో వేట్లపాలెం, జి.మేడపాడు, గుడపర్తి, సామర్లకోట ప్రాంతాలు విషాదంలో మునిగిపోయాయి.
ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
మృతుల జాబితా:
-
గండి మంగ (43), వెట్లపాలెం
-
వల్లూరి రవి (35), వెట్లపాలెం
-
కడింపల్లి కృపమ్మ, వెట్లపాలెం
-
గంపల మంగ, జి.మేడపాడు
-
గంపల నాగరాజు గోపి, జి.మేడపాడు
-
బిక్కిన కరుణ సుబ్బారావు (45), వెట్లపాలెం
-
సాధనాల సత్యవేణి (44), వెట్లపాలెం
-
గోదత నాని (26), వెట్లపాలెం
-
తుంపల లోవ (38), దుర్గా నగర్, వెట్లపాలెం
-
చింతల రమణ (60)
-
మండపల్లి చిన్ని (44), గుడపర్తి
-
గోదత మహేష్ (41), గుడపర్తి
-
దర్శిపాటి నాని (38), కుమ్మరి వీధి, సామర్లకోట
-
ఏడిద సంపత్ కుమార్ (25), కుమ్మరి వీధి, సామర్లకోట
-
నుకెళ్ళ దేవి (45), వెట్లపాలెం
-
గోదత వీర వెంకట రమణ (48), గుడపర్తి
-
కడింపల్లి ధనరాజు (55), గుడపర్తి
-
సాకుమళ్ళ రాఘవ (50), వెట్లపాలెం
-
అడబాల శ్రీనివాసరావు (55), వెట్లపాలెం
-
మాకర రాఘవమ్మ (55)
-
(ఒకరి వివరాలు నిర్ధారణలో ఉన్నట్లు సమాచారం)
ఈ ప్రమాదం అనేక కుటుంబాలను అనాథలుగా మార్చింది. గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం త్వరగా అందజేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz