బాణాసంచా ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించిన కందుల దుర్గేష్

0
1K

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్ర పేలుడు ఘటనలో గాయపడి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు.

ఆసుపత్రికి చేరుకున్న మంత్రి, బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి క్షతగాత్రికి అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, మందులు మరియు చికిత్సలో ఎలాంటి కొరత ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

బాధితులతో స్వయంగా మాట్లాడిన మంత్రి, వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు చికిత్స వివరాలను మంత్రికి వివరించారు. ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
New rules of Ration card.
కొత్త రేషన్ కార్డ్ నిబంధనలు 2026 కొత్త నిబంధనలు - ముఖ్యాంశాలు   కేంద్ర ప్రభుత్వం ప్రధాన్...
By G k Nookala 2026-03-05 10:34:37 0 98
Andhra Pradesh
విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో వృద్ధురాలి ఆందోళన
*Avja విజయవాడ*   *విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఉద్రిక్తత – అధికారులపై వృద్ధురాలు...
By Rajini Kumari 2026-04-13 08:24:25 0 100
Andhra Pradesh
చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
చీరాల: చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి...
By Gadiyapudi Narendra 2026-02-07 13:56:26 0 153
Andhra Pradesh
అంబటి రాంబాబు బెయిల్‌ పిటీషన్‌పై నేడు వాదనలు.
గుంటూరు లీగల్‌: మాజీ మంత్రి, వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు,...
By John Baji 2026-02-05 05:39:13 0 311
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com