• Pushpagiri: షార్ట్ ఫిలిం చిత్రీకరణకు వెళ్లి.. పెన్నాలో మునిగి ఇద్దరు యువకుల మృతి.
    కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం వెళ్లిన ముగ్గురు యువకులు పెన్నా నదిలో మునిగిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. కడప జిల్లా వల్లూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పుష్పగిరి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.   కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు 'ఫ్రంట్‌లైన్ ప్రెస్' పేరుతో ఒక బృందంగా ఏర్పడి...
    0 Comments 0 Shares 49 Views 0 Reviews
  • ఏనుగుల సంచారం.. అటవీశాఖ సూచనలు
    గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ పరిసర అరటి తోటల్లో, వరి పొలాల్లో ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు పొలాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. #RAJESH 
    0 Comments 0 Shares 47 Views 0 Reviews
  • Chandrababu Naidu: నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు.
      Chandrababu Naidu: నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు 05-04-2026 Sun 18:08 | Andhra Chandrababu Naidu Announces 100 Day Action Plan for Water Conservation   రాష్ట్రంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత' పేరుతో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను...
    0 Comments 0 Shares 43 Views 0 Reviews
  • నేడు తాడిపత్రి కి సీఎం రాక
    తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం లో జలధార ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు . ఈ కార్యక్రమానికి జిల్లా లోని మంత్రులు ఎమ్మెల్యే ఎంపీ లు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు  సమాచారం     
    0 Comments 0 Shares 33 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 2 Views 0 Reviews
  • పుంగనూరు: నెల్లి చెట్ల ఏరియాలో తిష్ట వేసిన 14 ఏనుగులు
    పుంగనూరు నియోజకవర్గం, పులిచర్ల మండలంలో పంటలను ధ్వంసం చేసిన 14 ఏనుగుల గుంపు శనివారం రాత్రి నుంచి తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని నెల్లిచెట్ల సమీపంలో తిష్ట వేసింది. కల్లూరు, పాలెం పంచాయతీల్లో మామిడి చెట్లను ధ్వంసం చేసిన ఈ ఏనుగులు, పాల్యం సమీపంలోని అటవీ సరిహద్దులో ఉన్న సోలార్ విద్యుత్ కంచె కారణంగా అడవిలోకి వెళ్లి నెల్లిచెట్ల వద్దకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి అక్కడే ఉన్న ఏనుగుల నేపథ్యంలో, సమీప...
    0 Comments 0 Shares 13 Views 0 Reviews
  • పుంగనూరు నియోజకవర్గ : ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
    పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో ఆదివారం పెద్ద ఉప్పరపల్లి బలిజ వీధికి చెందిన మునిరెడ్డి (40) రెడ్డివారిపల్లి సమీపంలోని రెడ్డివారి చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందాడు. చెరువు మధ్యలో ఉన్న మొక్కలలో ఇరుక్కుపోవడంతో అతను మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఎంతసేపటికి అతను తిరిగి రాకపోవడంతో, స్థానికులు సాయంత్రం గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
    0 Comments 0 Shares 13 Views 0 Reviews
  • పుంగనూరు: ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలి: సిపిఐ
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వెంకటరమణారెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితురాలి కుటుంబానికి అండగా నిలవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి కూడా పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    0 Comments 0 Shares 13 Views 0 Reviews
  • పుంగనూరు:42వ జాతీయ రహదారిపై ఆటో బోల్తా.. ఒకరికి గాయాలు
    పుంగనూరు పట్టణంలో 42వ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చిత్తూరు నుంచి వస్తున్న ఐచర్ వాహనం, MBT రోడ్లో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా కొట్టి రోడ్డుపై పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆటో నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.
    0 Comments 0 Shares 12 Views 0 Reviews
  • శిరోరక్ష - ప్రాణ రక్ష: హెల్మెట్ వాడకంపై బాపట్ల పోలీసుల మెగా బైక్ అవగాహన ర్యాలీ.
    చీరాల రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంతో బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ పరిధిలో 'శిరోరక్ష - ప్రాణ రక్ష' పేరుతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముందు వరుసలో పోలీసులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో, పోలీస్ సిబ్బంది,...
    0 Comments 0 Shares 1 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com