Pushpagiri: షార్ట్ ఫిలిం చిత్రీకరణకు వెళ్లి.. పెన్నాలో మునిగి ఇద్దరు యువకుల మృతి.

0
216

కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం వెళ్లిన ముగ్గురు యువకులు పెన్నా నదిలో మునిగిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. కడప జిల్లా వల్లూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పుష్పగిరి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.

 

కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు 'ఫ్రంట్‌లైన్ ప్రెస్' పేరుతో ఒక బృందంగా ఏర్పడి షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. వీరంతా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారు. ఆదివారం చిత్రీకరణ కోసం పుష్పగిరి వద్దనున్న పెన్నా నది వద్దకు వెళ్లారు. వారిలో హరిబాబు (25), హర్షవర్ధన్ (22), కృష్ణచైతన్య (20) చిత్రీకరణలో భాగంగా నదిలోకి దిగారు. అయితే, అక్కడ నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ప్రవాహానికి చిక్కుకుని ముగ్గురూ కొట్టుకుపోయారు.

 

గట్టున ఉన్న స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వల్లూరు ఎస్ఐ శివనాగిరెడ్డి, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికే హర్షవర్ధన్, హరిబాబు మృతదేహాలు లభ్యమయ్యాయి. వాటిని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. చీకటి పడటంతో గల్లంతైన కృష్ణచైతన్య కోసం గాలింపును నిలిపివేశారు.

 

మృతుడు హర్షవర్ధన్, గల్లంతైన కృష్ణచైతన్య కడప కేఎస్ఆర్‌ఎం కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. హరిబాబు ఓ హోమియోపతి కాలేజీలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆ ప్రాంతంలో సుడిగుండాలు ఉంటాయని, ప్రమాదకరమని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా యువకులు పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Health & Fitness
Breakthrough Designation for Liver Disease Therapy
The landscape of metabolic health shifted significantly as the US FDA granted Breakthrough...
By Dunna Jessicaruth 2026-05-19 07:06:45 0 82
BMA
"Break Their Legs" Order Raises Serious Concerns Over Police Brutality in Bhubaneswar
On June 29, 2025, Additional Commissioner of Bhubaneswar was caught on camera instructing...
By Citizen Rights Council 2025-06-30 08:54:59 0 3K
Telangana
అక్కారం పంప్ హౌజ్ నుంచి నీటి విడుదల
గజ్వేల్: గజ్వేల్ మండలం అక్కారం పంప్ హౌజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇటీవల బీఅర్ఎస్...
By Ponnala Srinivasrao 2026-03-16 10:09:22 0 245
Andhra Pradesh
కార్యకర్తలకు అండగా నూరి ఫాతిమా గారు – ధైర్యం కోల్పోవద్దు, పార్టీ మీకు తోడుంటుంది.
మాజీ మంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు గారి నివాసం వద్ద జరిగిన దురదృష్టకర ఘటనలో గాయపడిన మున్సిపల్...
By John Baji 2026-02-03 07:09:37 0 158
Andhra Pradesh
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద...
By Chennaiah Kati 2026-06-14 07:03:02 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com