సముద్రంలో మొరాయించిన కోరంగి టూరిజం బోటు – పర్యాటకుల్లో భయాందోళన

0
29

తాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి కోరంగి హోప్ ఐలాండ్‌కు 15 మంది పర్యాటకులతో బయలుదేరిన టూరిజం బోటు సముద్రంలో సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన ఘటన కలకలం రేపింది.

అचानक బోటు మొరాయించడంతో అందులో ఉన్న పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ బోటును ఘటనాస్థలానికి పంపించారు.

అధికారుల సమన్వయంతో రక్షణ చర్యలు వేగంగా కొనసాగించడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా పర్యాటకులను సురక్షితంగా తీరానికి తరలించారు. ఈ ఘటనతో కొంతసేపు సముద్రయాన సేవలు నిలిచిపోయాయి.

పర్యాటకులు మాట్లాడుతూ, టూరిజం బోట్ల ఫిట్నెస్‌ను నిరంతరం తనిఖీ చేయాలని, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కారు ఆటో డీ కొట్టుకోవడం వలన ఇద్దరు మృతి
శుక్రవారం రాత్రి పుంగనూరు బైపాస్ రోడ్డులో కారు ఆటోను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు...
By Kothuru Murali 2026-01-03 11:10:51 0 89
Andhra Pradesh
డ్రైనేజీలో పడిన గోమాతను కాపాడిన స్థానికులు
చీరాల: చీరాల మున్సిపల్ పరిధిలోని సంఘం థియేటర్ ఎదురుగా ఉన్న రోడ్డులో గోమాత ప్రమాదవశాత్తు జారి...
By Gadiyapudi Narendra 2026-02-17 15:51:47 0 34
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com