ఇంద్రనగర్ లేబర్ అడ్డా - శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు .|

0
237

మేడ్చల్   మల్కాజిగిరి జిల్లా   వెంకటాపురం డివిజన్ ఇంద్రనగర్ లేబర్ అడ్డా వద్ద శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్  రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొని మహారాజ్ చిత్రపటనికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ధైర్యసాహసాలకు, స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన చత్రపతి శివాజీ మహారాజ్  జీవితం, ఆలోచనలు, పరిపాలనా దూరదృష్టి యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశభక్తి, న్యాయపాలన, ప్రజాహితమే మహారాజ్  లక్ష్యమని, ఆ ఆదర్శాలను నేటి తరాలు ఆచరణలో పెట్టాలని కోరారు.

 

శివాజీ సేవా సమితి సభ్యులు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని ప్రతి ఆదివారం వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, బస్ స్టాప్‌లు మరియు వివిధ ప్రదేశాలలో స్వయంగా వండి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే  తెలిపారు. వారి సేవాభావాన్ని కొనియాడుతూ సమితి సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.

 

ఈ కార్యక్రమంలో శివాజీ సేవా సమితి సభ్యులు రవి నాయక్, గోపాల్ నాయక్, లక్ష్మణ్ నాయక్, శివారం నాయక్, తిరుపతి నాయక్, తులసి రామ్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు సురేష్, శ్రీనివాస్, లక్ష్మణ్ యాదవ్, పవన్, జమ్మిదార్ ముత్యాలు, రాజు మరియు స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Telangana
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి ...
By Sidhu Maroju 2025-08-31 17:44:56 0 383
Andhra Pradesh
మదనపల్లెలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్.. పారిశుద్ధ్య పనులు ముమ్మరం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమాన్ని ముమ్మరంగా...
By Pagadala Venkateswar 2026-06-01 04:29:27 0 112
Business & Finance
US Department of Justice Drops All Charges Against Gautam Adani
In a major victory for the Adani Group, the United States Department of Justice has officially...
By Dunna Jessicaruth 2026-05-19 10:29:58 0 65
Andhra Pradesh
జీడి మామిడి తోటల్లో ఏనుగుల సంచారం
గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోని జీడి మామిడి తోటల్లో మంగళవారం ఉదయం ఏనుగుల...
By Boiena Rajesh 2026-04-28 03:03:43 0 200
Andhra Pradesh
మొబైల్ ఫోన్స్ కొనేవారికి షాక్ !!!
వచ్చే ఏడాది స్మార్ట్ఫోన్ల ధరలు భారీ పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు AI...
By SivaNagendra Annapareddy 2025-12-17 05:46:33 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com