నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

0
342

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  తెలంగాణ రాష్ట్ర విద్యుత్, ఆర్థిక శాఖ, మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ని అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకై నిధులు కేటాయింపు, విద్యుత్ సబ్ స్టేషన్ ల ఏర్పాటు , అలాగే ప్రజావసరాల సమస్యలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.  అదే విధంగా, వెంకటాపురం డివిజన్ యాదమ్మనగర్‌లోని పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల వారు నివసించే ప్రాంతంలో విద్యుత్ బల్క్ మీటర్లు ఏర్పాటు చేయాలనీ ఎమ్మెల్యే  విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై వినతిపత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే  అభ్యర్థనకు ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. మల్కాజ్గిరి ప్రజల సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చారు.

   Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
విద్యా మనిషికి గౌరవానీ తెస్తుంది.
కౌకుంట్ల మండలం లోనీ పేరూరు గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ 75 వ వజ్రోత్సవాల సందర్భంగా...
By Dodla Nagaraju 2026-04-19 13:56:08 0 149
Andhra Pradesh
చీరాల మండలం, తోటవారిపాలెం గ్రామంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో  ముఖ్య అతిథిగా లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు పాల్గొన్నారు
చీరాల: చీరాల మండలం, తోటవారిపాలెం గ్రామంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో  ముఖ్య...
By Gadiyapudi Narendra 2025-12-24 17:23:06 0 200
Telangana
అర్హులైన పేదలందరికీ న్యాయం చేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు...
వెలుగుమట్ల భూముల వ్యవహారంలో అర్హులైన పేదలెవరైనా సరే, వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలని మంత్రి...
By Krishna Balina 2026-03-28 14:30:17 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com