బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల పై అవగాహన

0
312

బాపట్ల: ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈగల్ టీం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థినిలకు డ్రగ్స్, సైబర్ క్రైమ్,గంజాయి లాంటి మాదక ద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపట్ల క్రైమ్ డిఎస్పి మరియు బాపట్ల ఇన్చార్జి డిఎస్పి జగదీష్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ జగదీష్ నాయక్ మాట్లాడుతూ .. నేటితరం యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై విద్యార్థి దశలోనే వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అటువంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థినిలకు సూచించారు. చిన్న వయస్సులోనే మాదకద్రవయ్యలపై అవగాహన కలిగి వాటికీ దూరంగా ఉండాలని డ్రగ్స్ గంజాయి వంటి తుసుకుంటే మీ జీవితాలపై ప్రభావం చూపుతుంది అ తరువాత మీ జీవితం నాశనం అవుతుంది. ఈ మత్తు పదార్ధాలు సేవించడం వలన విద్యార్థి దశలోనే మత్తుకు బానిసై మీరు చేరుకోవలసిన లక్ష్యం చేజారిపోతుందని మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ గంజాయి సేవిస్తే 1972 కి కాల్ చేయాలనీ మీ వివరాలు గొప్యంగా ఉంచుతామని విద్యార్థినీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఐ హరిత, ఈగల్ టీం విద్యార్థినిలు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
వ్యక్తిఆత్మహత్యాయత్నం
పుంగనూరు మండలంలోని కమతంపల్లి గ్రామానికి చెందిన ఆనంద (42) కుటుంబ కలహాల కారణంగా గురువారం ఇంట్లో...
By Kothuru Murali 2025-12-26 06:34:14 0 197
Telangana
విద్యా ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట మండలంలో విద్యా ప్రారంభోత్సవం కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు...
By Sriramula Anil 2026-06-15 15:19:41 0 193
Andhra Pradesh
54 మంది లబ్ధిదారులకు 55 లక్షల 84 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచూరు పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో గల మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన అండ్...
By Benguluri Madhubabu 2026-06-06 10:00:54 0 149
Andhra Pradesh
నేడు వసంత పంచమి... శుభకార్యాలు చేయరాదు
వసంత పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. తెలివి తేటలు వృద్ధి చెందే రోజు గా...
By Karapati Gopi 2026-01-23 01:31:37 0 617
Andhra Pradesh
షబేబరాత్ (పెద్దల పండుగ) సందర్భంగా శ్మశాన వాటికను పరిశీలించిన :నజీర్ అహ్మద్
షబేబరాత్ (పెద్దల పండుగ) సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం శ్మశాన వాటికల్లో...
By John Baji 2026-02-03 11:33:37 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com