బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల పై అవగాహన

0
230

బాపట్ల: ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈగల్ టీం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థినిలకు డ్రగ్స్, సైబర్ క్రైమ్,గంజాయి లాంటి మాదక ద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపట్ల క్రైమ్ డిఎస్పి మరియు బాపట్ల ఇన్చార్జి డిఎస్పి జగదీష్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ జగదీష్ నాయక్ మాట్లాడుతూ .. నేటితరం యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై విద్యార్థి దశలోనే వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అటువంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థినిలకు సూచించారు. చిన్న వయస్సులోనే మాదకద్రవయ్యలపై అవగాహన కలిగి వాటికీ దూరంగా ఉండాలని డ్రగ్స్ గంజాయి వంటి తుసుకుంటే మీ జీవితాలపై ప్రభావం చూపుతుంది అ తరువాత మీ జీవితం నాశనం అవుతుంది. ఈ మత్తు పదార్ధాలు సేవించడం వలన విద్యార్థి దశలోనే మత్తుకు బానిసై మీరు చేరుకోవలసిన లక్ష్యం చేజారిపోతుందని మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ గంజాయి సేవిస్తే 1972 కి కాల్ చేయాలనీ మీ వివరాలు గొప్యంగా ఉంచుతామని విద్యార్థినీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఐ హరిత, ఈగల్ టీం విద్యార్థినిలు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలోకి చేరికలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చీకల చేను గ్రామానికి చెందిన పలు టీడీపీ కుటుంబాలు గురువారం...
By Kothuru Murali 2026-03-06 11:26:17 0 109
International
Women's Reservation Bill: The Political Game and the Hidden Reality
The implementation of the 2023 'Nari Shakti Vandan Adhiniyam' has sparked a fresh political row....
By Hazu MD. 2026-05-18 09:32:40 0 46
Andhra Pradesh
ఉషారామ ఇంజనీరింగ్ కాలేజీ ఒప్పందం
RTIH–ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల మధ్య అవగాహన ఒప్పందం విజయవాడ, ఫిబ్రవరి 06, 2026:...
By Rajini Kumari 2026-02-06 11:34:10 0 118
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టాటా ఏస్
పుంగనూరు పట్టణ పరిధిలోని మేలుపట్ల సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనాన్ని టాటా ఏస్ వాహనం ఢీకొన్న ఘటనలో...
By Kothuru Murali 2026-03-17 07:12:25 0 120
Telangana
నిజామాబాద్: ఆటోనగర్ లోని శ్రీ సాయి అద్వర్యంలో స్పె రే పెయింట్స్
నిజామాబాద్: శ్రీ సాయి స్ప్రే పెయింట్స్ లో సంతోష్ గౌడ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం...
By Sadaq Sadaq 2026-03-18 14:36:48 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com