బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల పై అవగాహన

0
160

బాపట్ల: ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈగల్ టీం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థినిలకు డ్రగ్స్, సైబర్ క్రైమ్,గంజాయి లాంటి మాదక ద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపట్ల క్రైమ్ డిఎస్పి మరియు బాపట్ల ఇన్చార్జి డిఎస్పి జగదీష్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ జగదీష్ నాయక్ మాట్లాడుతూ .. నేటితరం యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై విద్యార్థి దశలోనే వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అటువంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థినిలకు సూచించారు. చిన్న వయస్సులోనే మాదకద్రవయ్యలపై అవగాహన కలిగి వాటికీ దూరంగా ఉండాలని డ్రగ్స్ గంజాయి వంటి తుసుకుంటే మీ జీవితాలపై ప్రభావం చూపుతుంది అ తరువాత మీ జీవితం నాశనం అవుతుంది. ఈ మత్తు పదార్ధాలు సేవించడం వలన విద్యార్థి దశలోనే మత్తుకు బానిసై మీరు చేరుకోవలసిన లక్ష్యం చేజారిపోతుందని మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ గంజాయి సేవిస్తే 1972 కి కాల్ చేయాలనీ మీ వివరాలు గొప్యంగా ఉంచుతామని విద్యార్థినీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఐ హరిత, ఈగల్ టీం విద్యార్థినిలు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పునరుద్ధరించాలి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్
*వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పునరుద్దరించాలి    సత్వరమే నూతన వె్జ్ బోర్డు ఏర్పాటు...
By Rajini Kumari 2026-03-28 14:26:00 0 129
Karnataka
Karnataka Expands ‘Ganitha Ganaka’ Tutoring Scheme Statewide
Following its success in the 2024–25 pilot phase, Karnataka is expanding the Ganitha Ganaka...
By Bharat Aawaz 2025-07-17 06:45:40 0 1K
Telangana
ప్రిన్సిపల్ కుట్టడంతో విద్యార్థుల నిరసన
కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది...
By Prashanth Goindla 2026-02-10 12:05:51 0 184
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com