గంజాయి ధ్వంసం : కర్నూలు అడ్మిన్ ఎస్పీ

0
247

కర్నూలు : కర్నూలుజిల్లా...

10  లక్షల  33 వేల  విలువ గల గంజాయి ధ్వంసం ... 

అడిషనల్ ఎస్పీ అడ్మిన్  శ్రీ హుస్సేన్ పీరా . 

గౌరవ ఏపీ  డిజిపి గారి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారి పర్యవేక్షణలో  మంగళవారం భారీగా గంజాయిని ధ్వంసం చేసి నిప్పు అంటించి  తగలబెట్టారు. 

ఈ సంధర్బంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్  శ్రీ హుస్సేన్ పీరా   గారు  మాట్లాడుతూ...

ఈ రోజు  కర్నూలు జిల్లా లోని వివిధ పోలీసుస్టేషన్ ల పరిధులలో  27  కేసులలో  స్వాధీనం చేసుకున్న  126 కేజీ ల గంజాయిని   కర్నూలు నగర సమీపంలోని దిన్నేదేవరపాడు దగ్గర ఉన్న  జిల్లా పోలీసు ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో  ఎక్సైజ్  అధికారులు, రెవిన్యూ అధికారులు కలిసి ధ్వంసం చేశామన్నారు. 

 పెండింగ్ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ మొత్తాన్ని కోర్టు మెజిస్ట్రేట్  అనుమతితో , NDPS  Act  ప్రకారం ప్రోసిడింగ్స్ చేసి పంచనామా  ప్రకారం గంజాయిని ధ్వంసం చేసి కాల్చి వేయడం జరిగిందన్నారు. 

దహనం చేసిన గంజాయి విలువ   రూ. 10 లక్షల 33 వేలు ఉంటుందన్నారు. 

జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి ఉంచామన్నారు. 

 ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ గారితో పాటు ఎక్సైజ్ అడిషనల్ ఎస్పీ సుధీర్ బాబు , కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్,  ఎక్సైజ్ డిఎస్పీ రామకృష్ణా రెడ్డి,  నోడల్ ఆఫీసర్ సిఐ గుణశేఖర్ బాబు,  సిఐలు తేజమూర్తి, విక్రమసింహ, శేషయ్య, నాగరాజారావు, ఇతర ఎస్సైలు  పాల్గొన్నారు. 


Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: 450 సంవత్సరాల చరిత్ర గల గంగమ్మ జాతర మార్చి 10.11.
పుంగనూరులో ఈనెల 10, 11వ తేదీల్లో సుగుటూరు గంగమ్మ జాతరను నిర్వహిస్తున్నట్లు జమీందారులు మంగళవారం...
By Kothuru Murali 2026-03-04 06:58:18 0 134
Madhya Pradesh
New Digital Push: PM Family Care Tracker Enhances Health
The central government is spearheading a major digital transformation in rural development...
By Lokeshwari Panthadi 2026-07-01 07:06:32 0 46
Telangana
ఒంటిపై భారీగా బంగారం.. ఐటీశాఖ అదుపులో తెలంగాణ హాకీ చైర్మన్‌ ?
హైదరాబాద్‌ శేరిలింగంపల్లికి చెందిన తెలంగాణ హాకీ చైర్మన్‌ కొండా...
By Ponnala Srinivasrao 2026-03-28 03:42:50 0 233
Andhra Pradesh
బిజెపి నాయకులు వివాహ కార్యక్రమంలో
ఈరోజు పత్తికొండ బీజేపీ నాయకులు తుగ్గలి నవీన్ రెడ్డి గారి చెల్లెలు వివాహ వేడుకలో పాల్గొని బీజేపీ...
By Boya Dasthagiri 2026-04-26 13:15:36 0 159
Andhra Pradesh
జులై 29న గురు పౌర్ణమి వేడుకలు.. ముమ్మరంగా ఏర్పాట్లు!
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం గుడిశవారిపల్లి సాయిబాబా ఆలయంలో జులై 29న గురు పౌర్ణమి వేడుకలను...
By Pagadala Venkateswar 2026-07-24 05:14:24 0 17
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com