బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల పై అవగాహన

0
299

బాపట్ల: ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈగల్ టీం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థినిలకు డ్రగ్స్, సైబర్ క్రైమ్,గంజాయి లాంటి మాదక ద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపట్ల క్రైమ్ డిఎస్పి మరియు బాపట్ల ఇన్చార్జి డిఎస్పి జగదీష్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ జగదీష్ నాయక్ మాట్లాడుతూ .. నేటితరం యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై విద్యార్థి దశలోనే వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అటువంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విద్యార్థినిలకు సూచించారు. చిన్న వయస్సులోనే మాదకద్రవయ్యలపై అవగాహన కలిగి వాటికీ దూరంగా ఉండాలని డ్రగ్స్ గంజాయి వంటి తుసుకుంటే మీ జీవితాలపై ప్రభావం చూపుతుంది అ తరువాత మీ జీవితం నాశనం అవుతుంది. ఈ మత్తు పదార్ధాలు సేవించడం వలన విద్యార్థి దశలోనే మత్తుకు బానిసై మీరు చేరుకోవలసిన లక్ష్యం చేజారిపోతుందని మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ గంజాయి సేవిస్తే 1972 కి కాల్ చేయాలనీ మీ వివరాలు గొప్యంగా ఉంచుతామని విద్యార్థినీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఐ హరిత, ఈగల్ టీం విద్యార్థినిలు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
కొండ సముద్రం చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
పుంగనూరు మండలం, కొండ సముద్రం చెరువులో మంగళవారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. సుమారు...
By Kothuru Murali 2026-06-09 13:51:48 0 76
Manipur
Kakching Launches Stop Diarrhoea Campaign-2026
Health authorities in Manipur’s Kakching district have officially launched the "Stop...
By Lokeshwari Panthadi 2026-07-02 05:54:23 0 43
Andhra Pradesh
జై కిసాన్ స్కీమ్ విజేతలకు బహుమతులు పంపిణీ.
మదనపల్లి: రామసముద్రం టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం జై కిసాన్ జంక్షన్ ఆధ్వర్యంలో లక్కీ డిప్...
By Pagadala Venkateswar 2026-02-28 06:19:22 0 132
Andhra Pradesh
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు అవసరం
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డీడీఓ కిరణ్ కుమార్ అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-04-07 04:49:10 0 192
Telangana
తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ నోట్
ప్రెస్ నోట్. *రేపు నిజామాబాద్ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన* *శ్రీ రఘునాథ స్వామి (ఖిల్లా...
By Veeresh Kumar 2026-03-26 14:03:50 0 380
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com