యువత సన్మార్గంలో పయనించాలి

0
428

జుక్కల్: ఫిబ్రవరి 13, భరత్ అవాజ్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని బసవన్న  మందిరము వద్ద పూజ్య శ్రీ డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ (మల్లయ్య గిరి & దేగల్ మడి ఆశ్రమ పీఠాధిపతి) యోగ సాధన శిబిరం నిర్వహించారు. ప్రధానంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే అభివృద్ధి పయనంలోకి వస్తారని పేర్కొన్నారు. జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గత ఐదు రోజులుగా కొనసాగిన యోగా సాధన శిక్షణ శిబిరం తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పూజ శ్రీ బసవలింగ అవధూత మహారాజ్ మాట్లాడుతూ:--- ప్రస్తుతం ఏ రంగం చూసిన యువతదే ప్రధాన పాత్రఉంటుందని, అలాంటి యువత దేవుడు సూచించిన సన్మార్గాన్ని ఎంచుకోవాలని పేర్కొన్నారు. విద్యా,వైద్య,రాజకీయం... ఇలా అన్ని రంగాల్లోనూ యువత అభివృద్ధిని సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు దైవంతో సమానమని వారిని నిత్యం పూజించాలని, గౌరవించాలని. జూదం,ల్లో మట్కా, గంజాయి, మద్యంల్లోఇలాంటితు చెడు వ్యాసనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దరి చేయకుండా ఉండాలని సూచించారు. ముగిసిన తరగతులు.... యోగ సాధానతో అన్ని రోగాలను అధిగమించవచ్చని పూజ శ్రీ బసవలింగ అవధూత పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా కొనసాగిన యోగా సాధన శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ శిక్షణ తరగతులకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తగిలి వచ్చారు. శిక్షణ తరగతులు సాగిన ఐదు రోజులపాటు అందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.

                                     రిపోర్టర్: శివాజీ

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి...
By Kothuru Murali 2026-01-07 12:48:45 0 182
Telangana
"నా తల తాకట్టు పెట్టియినా నిధులు తెస్తా. పేదోడి ఇల్లు కట్టి తీరుతా, రైతుల కోసం ఎవరినైనా ఎదిరిస్తా. మోదీనైనా లెక్కచేయను-ఆసిఫాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గర్జన
🎤కొమరం భీం ఆసిఫాబాద్ (భారత్  ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-06-02 05:08:38 0 372
BMA
The Power of a Pinch of Salt: Gandhi’s Great March |
In 1930, the British Empire held a monopoly on one of life’s most basic...
By Bharat Aawaz 2026-03-12 10:04:27 0 492
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో సైబర్ నేరగాళ్ల మోసం
పుంగనూరులో స్మార్ట్ మోసం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఎమ్మెస్సార్ మూవీ...
By Kothuru Murali 2026-03-31 05:26:21 0 151
Andhra Pradesh
దర్శి మండలం లంకోజనపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కొరివి పెద్ద రామకోటయ్య గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా
దర్శి మండలం లంకోజనపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కొరివి పెద్ద రామకోటయ్య గారు ఇటీవల...
By Chennaiah Kati 2026-06-22 05:56:07 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com