Andhra Pradesh Budget: నేడే ఏపీ బడ్జెట్... కనకదుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్ ప్రతులకు పూజలు.

0
440

 

Andhra Pradesh Budget: నేడే ఏపీ బడ్జెట్... కనకదుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్ ప్రతులకు పూజలు

14-02-2026 Sat 10:47 | Andhra

Andhra Pradesh Budget 2024 Prayers Offered at Kanaka Durga Temple

2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

ఇంద్రకీలాద్రిలో బడ్జెట్ ప్రతులకు వేద పండితులతో పూజలు

బడ్జెట్ రూ. 3.50 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం

2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ అసెంబ్లీలో నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కనకదుర్గమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులను అమ్మవారి పాదాల చెంత ఉంచి వేద పండితులతో పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి బడ్జెట్ విజయవంతం కావాలని ఆశీర్వదించారు.

 

 

ఆ తర్వాత, బడ్జెట్ ప్రతులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు అందజేశారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో ఈ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనున్నారు.

 

 

ఈ బడ్జెట్ సుమారు రూ.3.46 లక్షల కోట్ల నుంచి రూ.3.50 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, బడ్జెట్ ప్రజలందరికీ మేలు చేకూర్చాలని అధికారులు అమ్మవారిని ప్రార్థించడం గమనార్హం

Search
Categories
Read More
Telangana
సింగరేణి గుర్తింపు సంఘం AITUC తో చర్చలు జరిపిన సింగరేణి డైరెక్టర్ (పా) : గౌతమ్ పొట్రూ
తేదీ 12/05/2026 :హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గుర్తింపు సంఘం అయిన సింగరేణి కాలరీస్...
By Avunoori Mahesh 2026-05-12 17:26:19 0 196
Telangana
మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక గిరిజనుల నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలను ఏం చేశారు?
‎సింగర్ మంగ్లీ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం...
By Ponnala Srinivasrao 2026-05-01 02:46:02 0 123
BMA
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears In a democracy, media is not just a messenger —...
By BMA ADMIN 2025-05-24 06:25:30 0 3K
Telangana
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  అల్వాల్ సర్కిల్‌ వెంకటాపురం‌లో ప్రజా పాలన దినోత్సవంలో...
By Sidhu Maroju 2025-09-17 09:58:40 0 278
Andhra Pradesh
అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో సంబరాలు
.డి. డి.ఆర్.డి.ఎ ఆదేశాల మేరకు, అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో ప్రజలు గురువారం...
By Kothuru Murali 2026-04-03 09:28:03 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com