భీమన్న సేవలో రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణు కుమార్

1
2K

వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రి, ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​మంత్రి ఆలయానికి చేరుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ​తర్వాత స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ జి. శ్రావణ్ కుమార్ మంత్రికి స్వామివారి శేష వస్త్రం, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ​ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్, ఎమ్మార్వో జయంత్, ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ, ఎడ్ల శివసాయి, జూనియర్ అసిస్టెంట్ సింహాచారి, జూనియర్ అసిస్టెంట్ నరాల రాజు, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: 'అంబులెన్స్‌కు ఫోన్ చెయ్యలేదు.. ఆ వార్త అవాస్తవం'
పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామానికి చెందిన నారాయణమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె భర్త రామయ్య...
By Kothuru Murali 2026-02-25 09:52:49 0 142
Himachal Pradesh
Himachal Pradesh Boosts Sustainable Tourism Growth in 2026
Himachal Pradesh continues to strengthen its tourism sector by promoting sustainable and...
By Fathima Safa 2026-07-06 06:32:12 0 49
Delhi - NCR
Delhi University Begins CSAS UG Admissions 2026
The University of Delhi has officially started the Common Seat Allocation System (CSAS) 2026...
By Navya Sree 2026-06-27 06:36:19 0 45
Andhra Pradesh
మదనపల్లె రైల్వే స్టేషన్‌లో మహిళకు తీవ్ర గాయాలు.
మదనపల్లె పట్టణంలోని రైల్వే స్టేషన్లో శనివారం ఓ మహిళ మెట్లపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడింది....
By Pagadala Venkateswar 2026-02-14 12:47:08 0 154
Andhra Pradesh
డ్రగ్స్ పై దండయాత్ర
*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*     *పత్రికా...
By Rajini Kumari 2026-02-05 07:41:38 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com