"ఖరీదైన దాహం"... వృద్ధురాలి గొలుసు లాక్కెళ్ళిన కేటుగాడు కటకటాల్లోకి..|

0
205

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మంచినీళ్ల పేరుతో నమ్మించి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన నిందితుడిని అల్వాల్ పోలీసులు కేవలం 48 గంటల్లోనే అరెస్టు చేశారు. నిందితుడి నుండి బంగారం, బైక్ మరియు మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

 

ఘటన వివరాలు :

 

ఈనెల 10వ తేదీ రాత్రి 7:30 గంటల సమయంలో వెస్ట్ వెంకటాపురానికి చెందిన 70 ఏళ్ళ వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా.. నిందితుడు మంచినీళ్లు కావాలని అడుగుతూ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆపై ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న 14 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకొని పరారయ్యాడు. ఈ క్రమంలో కింద పడిపోయిన వృద్ధురాలికి గాయాలయ్యాయి.  

 

బాధితురాలి కుమారుడు ప్రియ చంద్రకుమార్ ఫిర్యాదుతో అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 

నిందితుడి అరెస్ట్ :

 

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాలింపు చేపట్టిన పోలీసు బృందం, గురువారం సాయంత్రం పీజేఆర్ విగ్రహం సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పల్సర్ బైక్ పై వెళ్తున్న అల్లాడి సుభాష్ గౌడ్ (26) అనుమానస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా దోపిడీకి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. 

 

నిందితుడు మీర్ పేట్ లో నివసిస్తూ మొబైల్ సర్వీస్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

 

స్వాధీనం చేసుకున్న సొత్తు:

 

నిందితుడు చోరీ చేసిన 14 గ్రాముల బంగారు గొలుసు, నేరానికి వాడిన పల్సర్ బైక్, మరియు, మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

 

పోలీసుల హెచ్చరిక : 

 

ఒంటరిగా ఉండే వృద్దులు, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అల్వాల్ ఎస్ హెచ్ ఓ. (SHO) ప్రశాంత్ సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్-100 కు సమాచారం అందించాల్సిందిగా కోరారు. 

 

త్వరితగతిన కేసును చేదించిన పోలీసుల బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
SURAKSHA
B. Lakshmi Kantham, IAS: Championing Good Governance Excellence
B. Lakshmi Kantham, IAS: A Distinguished Civil Servant Committed to Transforming Governance A...
By Lokeshwari Panthadi 2026-07-13 13:33:39 0 178
Andhra Pradesh
పుంగనూరు: విపక్షాల తీరుపై మైనార్టీ మోర్చా ధ్వజం
చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలు అనుసరిస్తున్న...
By Kothuru Murali 2026-04-18 09:31:03 0 101
Telangana
జూన్ 16 నుండి 28 వరకు హైదరాబాద్లో రగ్బీ ప్రీమియర్ లీగ్ పోటీల నిర్వహణ : అధ్యక్షులు నరేంద్ర రామ్ నంబూల
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బాలయోగి అథ్లెటిక్స్  స్టేడియంలో జూన్ 16 నుండి 28...
By Avunoori Mahesh 2026-06-14 10:20:48 0 254
Andhra Pradesh
Chandrababu : దావోస్‌లో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. యూఏఈ మంత్రితో కీలక భేటీ.
దావోస్‌ పర్యటనలో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రితో సమావేశం...
By Pagadala Venkateswar 2026-01-20 10:46:07 0 306
Andhra Pradesh
సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలి
సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఎంపీడీవో రవికుమార్ ఆదేశించారు. బొబ్బిలి (M) జగన్నాపురం...
By Boiena Rajesh 2026-04-17 13:26:03 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com