జూన్ 16 నుండి 28 వరకు హైదరాబాద్లో రగ్బీ ప్రీమియర్ లీగ్ పోటీల నిర్వహణ : అధ్యక్షులు నరేంద్ర రామ్ నంబూల

0
253

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బాలయోగి అథ్లెటిక్స్  స్టేడియంలో జూన్ 16 నుండి 28 వరకు నిర్వహించబడనున్న ప్రతిష్టాత్మక రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) సీజన్ 2లో 10 జట్లు (6 పురుషుల ఫ్రాంచైజీలు మరియు 4 మహిళల జట్లు) పాల్గొంటాయని ఇవి 48 మ్యాచ్లలో పోటీపడతాయని ఇందులో 19 దేశాల నుండి 70 మందికి పైగా అంతర్జాతీయ రగ్బీ సెవెన్స్ ఆటగాళ్లతో పాటు భారతదేశంలోని అగ్రశ్రేణి రగ్బీ ప్రతిభావంతులు కూడా పాల్గొంటారని తెలిపారు భారతదేశపు ప్రధాన ఫ్రాంచైజీ ఆధారిత రగ్బీ పోటీగా, ఈ లీగ్ క్రీడను అభివృద్ధి చేయడంలో భారత దేశం యొక్క విస్తృత క్రీడా, ఒలింపిక్ ఆశయాలకు మద్దతు ఇవ్వడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగన్నారు. తెలంగాణ క్రీడా శాఖ క్రీడలను ప్రోత్సహించడంలో వివిధ క్రీడాంశాలలో లీగ్ పోటీలకు సహకారం అందజేస్తుందని తెలిపారు, తెలంగాణ రాష్ట్రంలోని రగ్బీ క్రీడాకారులు, కోచ్‌లు, రిఫరీలు, జిల్లా సంఘాల ప్రతినిధులు మరియు క్రీడాభిమానులందరినీ తెలంగాణ రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు నరేంద్ర రామ్ నంబూల, రాష్ట్ర కార్యదర్శి ఆదిత్య ఉట్పల హృదయపూర్వకంగా ఆహ్వానించారు,భారతదేశంలో రగ్బీ క్రీడకు కొత్త ఊపును తీసుకువస్తున్న ఈ లీగ్‌లో దేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారని, ఈ అవకాశాన్ని తెలంగాణ రగ్బీ కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.రగ్బీ అభివృద్ధికి మనమంతా భాగస్వాములం. రండి... రగ్బీ ప్రీమియర్ లీగ్‌ను విజయవంతం చేసి తెలంగాణ రగ్బీ సత్తాను చాటుదాం.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పులి శ్రీనివాసులు గారు
మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పులి శ్రీనివాసులు గారిని...
By Chennaiah Kati 2026-01-20 07:02:07 0 339
Andhra Pradesh
ఆదివారం కర్నూలు లో క్లీన్ & గ్రీన్ సిటీ కార్యక్రమం :
కర్నూలు : రేపు ఆదివారం కర్నూలు లో  క్లీన్ & గ్రీన్ సిటీ స్పెషల్ డ్రైవ్...నగరాన్ని క్లీన్...
By Hari Krishna 2025-12-13 10:56:23 0 332
Bharat Aawaz
📣 భారత్ అకాడమీ నుండి బిగ్ అనౌన్స్‌మెంట్! 📣
రేపటి సమాజాన్ని ప్రభావితం చేసే గొంతుకగా మారాలనుకుంటున్నారా? మీ నిరీక్షణకు సమయం ఆసన్నమైంది! 🎤...
By Pulse 2026-04-11 04:55:54 0 758
Business & Finance
Madhya Pradesh Expands Green Energy with 950 MW Solar
Union Minister Pralhad Joshi inaugurated 950 MW of solar power projects in Madhya Pradesh and...
By Navya Sree 2026-07-01 05:21:10 0 49
SURAKSHA
A. Mallikarjuna, IAS: Driving Excellence in Public Governance
A Dynamic Civil Servant Advancing Revenue Administration, Public Welfare, and Citizen-Centric...
By Lokeshwari Panthadi 2026-07-13 11:47:59 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com