అక్రమ కట్టడంపై అధికారుల కొరడా

0
158

*తాడేపల్లి*

 

*అక్రమ కట్టడంపై అధికారుల కొరడా...*

 

*నిబంధనలను అతిక్రమించి, అనుమతులు లేకుండా తాడేపల్లి పట్టణ పరిధిలోని మహానాడు ప్రాంతంలో నిర్మిస్తున్న ఓ బహుళ అంతస్తుల భవనాన్ని మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు....*

 

*అయితే సదరు భవనం మూడో అంతస్తు కట్టేదాక అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారా.....అనేది ప్రశ్నర్ధకంగా ఉంది...*

 

*ఎవరైనా చిరు వ్యాపారులు పొట్టకూటి కోసం రోడ్ పక్కన చిన్న షెడ్ వేసుకోవడానికి ప్రయత్నిస్తే...ఆఘమేఘాల మీద చర్యలు తీసుకునే అధికారులు... ఈ భవనం విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక రాజకీయ కోణాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం...*

 

*సదరు బిల్డింగ్ పై సోషల్ మీడియాలో కథనాలు, పలువురి ఫిర్యాదులు కారణంగా...చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ అధికారులు...*

 

*ఆ కూల్చివేత ప్రక్రియ ను కవర్ చేసేందుకు వెళ్లిన ఓ మీడియా ప్రతినిదిపై,ఓ ప్లానింగ్ అధికారి చిందులు తొక్కడం చర్చనీయాంశం..*

 

*వార్తలు కవర్ చేయడానికి కూడా అనుమతి తీసుకోవాలంటూ ఆ అధికారి...చెప్పడం విశేషం...*

 

*అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అరికట్టలేని అధికారులు... ఇలా విచిత్రంగా ప్రవర్తించడం విమర్శలకు తావిస్తోంది*

Search
Categories
Read More
Telangana
కిషన్ ప్రసాద్ కాలనీకి శాశ్వత పరిష్కారం - శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో గల కిషన్ ప్రసాద్ కాలనీలో జరుగుతున్న...
By Sidhu Maroju 2026-02-04 09:43:16 0 142
Telangana
రాత్రిపూట ఇంటి తాళం పగలగొట్టి బంగారు వెండి నగల చోరీ
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్  డిటెక్టివ్ ఇన్స్పెక్టర్  తిమ్మప్ప తెలిపిన...
By Sidhu Maroju 2025-09-23 16:01:54 0 364
Andhra Pradesh
చీటీల్లో రూ. 1. 30 కోట్లు నష్టం – ఎస్పీకి బాధితుల ఫిర్యాదు.
మదనపల్లిలో చీటీల పేరుతో సుమారు రూ. 1.30 కోట్ల మేర నష్టం జరిగినట్లు బాధితులు సోమవారం అన్నమయ్య...
By Pagadala Venkateswar 2026-02-02 12:17:22 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com