నూతన అధ్యక్షులకు పూలదండతో సత్కరిస్తున్న కమిటీ సభ్యులు బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరి.

0
40

బాపట్ల: బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని బాపట్ల క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సలహాదారులు గంట అంజిబాబు తెలిపారు. స్థానిక బాపట్ల క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారంక్రికెట్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల క్రికెటర్ అసోసియేషన్ గత పాలకవర్గ కమిటీ కాలపరిమితి ముగిసినందున నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన కమిటీలో ప్రెసిడెంట్ ఎర్ర అంకమ్మ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ బీ.జేరామ్ రెడ్డి ,సెక్రటరీ బిల్లా స్టాండ్లీ విమల్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఎలవల నరేష్ ,ట్రెజరర్ అబ్దుల్ కరీం అదేవిధంగా బాపట్ల క్రికెట్ అసోసియేషన్కు గౌరవ అధ్యక్షులుగా బందా బాబు, సిహెచ్ రోశయ్యలో తో పాటు సభ్యులుగా పఠాన్ రాజేష్, ఎం శ్రీనివాసరావు ,కొట్ర వెంకటరావు, కొమరోలు శ్రీనివాసరావుని కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. అనంతరం ప్రెసిడెంట్ అంకమ్మ చౌదరి మాట్లాడుతూ బాపట్ల క్రికెట్ అసోసియేషన్ బలోపేతనానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు బాపట్ల జిల్లాలో యువ క్రికెట్ క్రీడాకారుల అభివృద్ధికి కమిటీ సభ్యులందరూ తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. గత కమిటీ ఆధ్వర్యంలో యువ క్రీడాకారుల కోసం నెట్స్ ప్రాక్టీస్ నిమిత్తం గ్రౌండ్ కేటాయించడం జరిగిందన్నారు. యువ క్రీడాకారుల కోసం నెక్స్ట్ ప్రాక్టీస్ చేసేందుకు స్థలాన్ని కేటాయించిన బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ,కలెక్టర్ వినోద్ కుమార్ లకు మా నూతన కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు. నూతనంగా ఎంపికైన బాపట్ల క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు ప్రజా ప్రతినిధులు,సీనియర్ క్రికెట్ క్రీడాకారుల సలహాలు, సహకారాలు, అందించాలని ఆయన కోరారు.

 

#Narendra

Search
Categories
Read More
Puducherry
CM–LG Standoff in Puducherry Ends with Temporary Truce
A power struggle erupted when Lt. Governor K. Kailashnathan unilaterally appointed a Health...
By Bharat Aawaz 2025-07-17 07:10:31 0 1K
Andhra Pradesh
డిసెంబర్ 22న ప్రజా సమస్యల పరిష్కార వేదిక వినతుల స్వీకరణ డాక్టర్ జి లక్ష్మీశ
*పత్రికా ప్రకటన*  *ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 21, 2025*   *డిసెంబర్ 22న ప్రజా సమస్యల...
By Rajini Kumari 2025-12-21 12:25:54 0 128
Andhra Pradesh
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి తో చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ:*   *ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-02-10 10:24:43 0 44
Andhra Pradesh
పుంగనూరు: మంత్రిని కలిసిన టీడీపీ మైనారిటీ నాయకులు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా రెడ్డిని...
By Kothuru Murali 2026-01-21 09:38:35 0 72
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com