నూతన అధ్యక్షులకు పూలదండతో సత్కరిస్తున్న కమిటీ సభ్యులు బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరి.

0
41

బాపట్ల: బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని బాపట్ల క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సలహాదారులు గంట అంజిబాబు తెలిపారు. స్థానిక బాపట్ల క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారంక్రికెట్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల క్రికెటర్ అసోసియేషన్ గత పాలకవర్గ కమిటీ కాలపరిమితి ముగిసినందున నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన కమిటీలో ప్రెసిడెంట్ ఎర్ర అంకమ్మ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ బీ.జేరామ్ రెడ్డి ,సెక్రటరీ బిల్లా స్టాండ్లీ విమల్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఎలవల నరేష్ ,ట్రెజరర్ అబ్దుల్ కరీం అదేవిధంగా బాపట్ల క్రికెట్ అసోసియేషన్కు గౌరవ అధ్యక్షులుగా బందా బాబు, సిహెచ్ రోశయ్యలో తో పాటు సభ్యులుగా పఠాన్ రాజేష్, ఎం శ్రీనివాసరావు ,కొట్ర వెంకటరావు, కొమరోలు శ్రీనివాసరావుని కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. అనంతరం ప్రెసిడెంట్ అంకమ్మ చౌదరి మాట్లాడుతూ బాపట్ల క్రికెట్ అసోసియేషన్ బలోపేతనానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు బాపట్ల జిల్లాలో యువ క్రికెట్ క్రీడాకారుల అభివృద్ధికి కమిటీ సభ్యులందరూ తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. గత కమిటీ ఆధ్వర్యంలో యువ క్రీడాకారుల కోసం నెట్స్ ప్రాక్టీస్ నిమిత్తం గ్రౌండ్ కేటాయించడం జరిగిందన్నారు. యువ క్రీడాకారుల కోసం నెక్స్ట్ ప్రాక్టీస్ చేసేందుకు స్థలాన్ని కేటాయించిన బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ,కలెక్టర్ వినోద్ కుమార్ లకు మా నూతన కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు. నూతనంగా ఎంపికైన బాపట్ల క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు ప్రజా ప్రతినిధులు,సీనియర్ క్రికెట్ క్రీడాకారుల సలహాలు, సహకారాలు, అందించాలని ఆయన కోరారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
రొంపిచర్ల క్రాస్ లో కోళ్ల లారీ బోల్తా
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ లో సోమవారం తిరుపతి నుంచి కల్లూరుకు వెళుతున్న కోళ్ల లారీ...
By Kothuru Murali 2026-01-05 12:53:57 0 86
Telangana
ప్రపంచ శాంతి కోసమే క్రైస్తవ ఉజ్జీవ సభనలు: ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్: కంటోన్మెంట్|  మడ్ ఫోర్డ్ హాకీ గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి కోసం ఫాదర్...
By Sidhu Maroju 2025-10-25 16:14:32 0 169
Andhra Pradesh
కార్యకుల సమ్మెతో పోర్టులో నిలిచిపోయిన కార్యకలాపాలు – చట్టాల మార్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన
కాకినాడ: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కేంద్ర కార్మిక సంఘాలు...
By Ratna Sekhar 2026-02-12 09:19:58 0 92
Andhra Pradesh
Chandrababu Naidu: ఇజ్రాయెల్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ.
ఇజ్రాయెల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రితో చంద్రబాబు సమావేశం సాంకేతిక సహకారం అందించాలని కోరిన...
By Pagadala Venkateswar 2026-01-21 14:44:30 0 52
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com