నూతన అధ్యక్షులకు పూలదండతో సత్కరిస్తున్న కమిటీ సభ్యులు బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరి.

0
191

బాపట్ల: బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని బాపట్ల క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సలహాదారులు గంట అంజిబాబు తెలిపారు. స్థానిక బాపట్ల క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారంక్రికెట్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల క్రికెటర్ అసోసియేషన్ గత పాలకవర్గ కమిటీ కాలపరిమితి ముగిసినందున నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన కమిటీలో ప్రెసిడెంట్ ఎర్ర అంకమ్మ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ బీ.జేరామ్ రెడ్డి ,సెక్రటరీ బిల్లా స్టాండ్లీ విమల్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఎలవల నరేష్ ,ట్రెజరర్ అబ్దుల్ కరీం అదేవిధంగా బాపట్ల క్రికెట్ అసోసియేషన్కు గౌరవ అధ్యక్షులుగా బందా బాబు, సిహెచ్ రోశయ్యలో తో పాటు సభ్యులుగా పఠాన్ రాజేష్, ఎం శ్రీనివాసరావు ,కొట్ర వెంకటరావు, కొమరోలు శ్రీనివాసరావుని కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. అనంతరం ప్రెసిడెంట్ అంకమ్మ చౌదరి మాట్లాడుతూ బాపట్ల క్రికెట్ అసోసియేషన్ బలోపేతనానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు బాపట్ల జిల్లాలో యువ క్రికెట్ క్రీడాకారుల అభివృద్ధికి కమిటీ సభ్యులందరూ తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. గత కమిటీ ఆధ్వర్యంలో యువ క్రీడాకారుల కోసం నెట్స్ ప్రాక్టీస్ నిమిత్తం గ్రౌండ్ కేటాయించడం జరిగిందన్నారు. యువ క్రీడాకారుల కోసం నెక్స్ట్ ప్రాక్టీస్ చేసేందుకు స్థలాన్ని కేటాయించిన బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ,కలెక్టర్ వినోద్ కుమార్ లకు మా నూతన కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు. నూతనంగా ఎంపికైన బాపట్ల క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు ప్రజా ప్రతినిధులు,సీనియర్ క్రికెట్ క్రీడాకారుల సలహాలు, సహకారాలు, అందించాలని ఆయన కోరారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పెన్షన్ కోసం బిడ్డను భుజాన మోసుకుని కలెక్టరేట్‌కు.
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తంబళ్లపల్లికి...
By Pagadala Venkateswar 2026-06-16 04:23:51 0 51
Uttarkhand
Char Dham Yatra Safety and Pre-Monsoon Strategy Prioritised
With the summer season peaking, Chief Minister Pushkar Singh Dhami directed state officials to...
By Dunna Jessicaruth 2026-05-25 10:59:32 0 555
Andhra Pradesh
PDS బియ్యం అక్రమంగా తరలిస్తున్న రేండు వాహనాలు స్వాధీనం, 6 టన్నుల PDS బియ్యం పట్టివేత.
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ...
By John Baji 2026-01-12 14:17:57 0 208
Andhra Pradesh
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జెఎసి చైర్మన్ ఏ విద్యాసాగర్
*ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.* *సమాన పనికి సమాన వేతన విధానాన్ని అమలు చేయాలి*...
By Rajini Kumari 2025-12-21 16:26:48 0 249
Andhra Pradesh
నందిగామలో భక్తిశ్రద్ధలతో పీర్ల పండగ వేడుకలు
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన అన్నదాన కార్యక్రమంనందిగామ పట్టణంలో పీర్ల పండుగను భక్తిశ్రద్ధలతో,...
By Patan Khuddus 2026-06-25 18:19:42 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com