Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన.

0
28

 

 

Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన

11-02-2026 Andhra

Pawan Kalyan Warns TDP Janasena BJP to Be Vigilant Against YSR Congress

చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం

వైసీపీ కుట్రల పట్ల టీడీపీ, జనసేన, బీజేపీ అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచన

హిందూమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని వైసీపీ చూస్తోందని ఆరోపణ

 

వైసీపీపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగిస్తుండగా 11 నిమిషాల పాటు నిరసన తెలిపి వాకౌట్ చేశారు.

 

అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కమిటీ హాలులో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, వైసీపీ కుట్రల పట్ల కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

వైసీపీ హిందూమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ హిందూమతాన్ని గౌరవిస్తారని అన్నారు. మన ప్రభుత్వంపై జగన్, ఆయన పార్టీ చేసే కుట్రలను గుర్తించాలని అన్నారు.

 

అనంతరం, పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, సభలో ఎంతసేపు మాట్లాడామనే దానికంటే అవసరమైన విషయం ఎంత మాట్లాడామనేది ముఖ్యమని అన్నారు. దావోస్‌లో ముఖ్యమంత్రి, తాను ప్రతి సంస్థపై ముందస్తుగా కసరత్తు చేసినట్లు చెప్పారు. అందుకే తమను కలిసిన ప్రతి సంస్థకు ముఖ్యమంత్రి క్లుప్తంగా ఏడు నిమిషాల్లోనే విషయం చెప్పి ముగించేవారని గుర్తు చేసుకున్నారు. అందుకే తక్కువ సమయంలో ఎక్కువమంది పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి కలవగలిగారని అన్నారు. శాసనసభలో కూడా సభ్యులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రంగ కుమార్తె వంగవీటి ఆసకిరణ్
*విజయవాడ*:     వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రంగా కుమార్తె...
By Rajini Kumari 2025-12-26 10:01:04 0 99
Telangana
ఆల్వాల్ ల్లో "మూడవ కన్ను" : సిసి కెమెరాలతో పటిష్టమైన నిఘా .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : అల్వాల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం పెరుగుతున్న జనాభా...
By Sidhu Maroju 2026-01-12 16:25:13 0 139
Andhra Pradesh
గో టుకూరు రెవెన్యూ పరిధిలోని భూ సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల
*గోటుకూరు రెవెన్యూ గ్రామం నందు రి సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల*   ఉరవకొండ...
By BOYA MADHU 2026-01-23 11:47:56 0 137
Andhra Pradesh
బి. కొత్తకోట: చెట్టుపై నుంచి పడి రైతుకు తీవ్ర గాయాలు.
బుధవారం కొత్తకోట మండలంలో రామప్ప (55) అనే రైతు చింతచెట్టుపై నుంచి కాయలు కోస్తుండగా కాలు జారి కింద...
By Pagadala Venkateswar 2026-02-11 11:30:50 0 31
Telangana
కిషన్ ప్రసాద్ కాలనీకి శాశ్వత పరిష్కారం - శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో గల కిషన్ ప్రసాద్ కాలనీలో జరుగుతున్న...
By Sidhu Maroju 2026-02-04 09:43:16 0 45
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com