Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన.

0
111

 

 

Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన

11-02-2026 Andhra

Pawan Kalyan Warns TDP Janasena BJP to Be Vigilant Against YSR Congress

చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం

వైసీపీ కుట్రల పట్ల టీడీపీ, జనసేన, బీజేపీ అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచన

హిందూమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని వైసీపీ చూస్తోందని ఆరోపణ

 

వైసీపీపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగిస్తుండగా 11 నిమిషాల పాటు నిరసన తెలిపి వాకౌట్ చేశారు.

 

అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కమిటీ హాలులో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, వైసీపీ కుట్రల పట్ల కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

వైసీపీ హిందూమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ హిందూమతాన్ని గౌరవిస్తారని అన్నారు. మన ప్రభుత్వంపై జగన్, ఆయన పార్టీ చేసే కుట్రలను గుర్తించాలని అన్నారు.

 

అనంతరం, పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, సభలో ఎంతసేపు మాట్లాడామనే దానికంటే అవసరమైన విషయం ఎంత మాట్లాడామనేది ముఖ్యమని అన్నారు. దావోస్‌లో ముఖ్యమంత్రి, తాను ప్రతి సంస్థపై ముందస్తుగా కసరత్తు చేసినట్లు చెప్పారు. అందుకే తమను కలిసిన ప్రతి సంస్థకు ముఖ్యమంత్రి క్లుప్తంగా ఏడు నిమిషాల్లోనే విషయం చెప్పి ముగించేవారని గుర్తు చేసుకున్నారు. అందుకే తక్కువ సమయంలో ఎక్కువమంది పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి కలవగలిగారని అన్నారు. శాసనసభలో కూడా సభ్యులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పార్లమెంటరీ హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు.
బాపట్ల: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణ ప్రసాద్ తెన్నేటి...
By Gadiyapudi Narendra 2026-02-17 15:55:02 0 131
Andhra Pradesh
కోనేరు అక్రమణలు తొలగించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన
నందిగామలో  రాస్తారోక నిర్వహించిన హిందూ సంఘాలు  హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కమిటీ...
By Patan Khuddus 2026-05-08 15:26:30 0 632
Odisha
🛕 పూరీ జగన్నాథ రథయాత్రకు భక్తుల పోటెత్తు – భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా
ఒడిశా, పూరీ: జగన్నాథ స్వామి వార్షిక రథయాత్ర మహోత్సవం ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. వేల ఏళ్లుగా...
By Bharat Aawaz 2025-06-27 07:58:21 0 2K
Andhra Pradesh
తాడేపల్లి లోని ఏం బుక్ కార్మికులను పగలు డ్యూటీలకు రావాలని కాంట్రాక్టర్ల ఒత్తిడి
తాడేపల్లి లోని ఎం బుక్ కార్మికులను పగలు డ్యూటీలకు రావాలని కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకు కార్మికులను...
By Rajini Kumari 2025-12-21 12:11:54 0 204
Andhra Pradesh
పలు గ్రామాల్లో నేడు పవర్ కట్
బొబ్బిలి మండలం పారాది సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే పారాది, నారాయణప్పవలస, మెట్టవలస ఫీడర్...
By Boiena Rajesh 2026-05-01 01:24:52 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com