Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన.

0
144

 

 

Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన

11-02-2026 Andhra

Pawan Kalyan Warns TDP Janasena BJP to Be Vigilant Against YSR Congress

చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం

వైసీపీ కుట్రల పట్ల టీడీపీ, జనసేన, బీజేపీ అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచన

హిందూమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని వైసీపీ చూస్తోందని ఆరోపణ

 

వైసీపీపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగిస్తుండగా 11 నిమిషాల పాటు నిరసన తెలిపి వాకౌట్ చేశారు.

 

అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కమిటీ హాలులో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, వైసీపీ కుట్రల పట్ల కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

వైసీపీ హిందూమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ హిందూమతాన్ని గౌరవిస్తారని అన్నారు. మన ప్రభుత్వంపై జగన్, ఆయన పార్టీ చేసే కుట్రలను గుర్తించాలని అన్నారు.

 

అనంతరం, పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, సభలో ఎంతసేపు మాట్లాడామనే దానికంటే అవసరమైన విషయం ఎంత మాట్లాడామనేది ముఖ్యమని అన్నారు. దావోస్‌లో ముఖ్యమంత్రి, తాను ప్రతి సంస్థపై ముందస్తుగా కసరత్తు చేసినట్లు చెప్పారు. అందుకే తమను కలిసిన ప్రతి సంస్థకు ముఖ్యమంత్రి క్లుప్తంగా ఏడు నిమిషాల్లోనే విషయం చెప్పి ముగించేవారని గుర్తు చేసుకున్నారు. అందుకే తక్కువ సమయంలో ఎక్కువమంది పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి కలవగలిగారని అన్నారు. శాసనసభలో కూడా సభ్యులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జిల్లా వాసి ఇతనే
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన...
By Kothuru Murali 2026-05-17 17:00:11 0 130
Andhra Pradesh
మదనపల్లిలో హ్యాండ్లూమ్ దుకాణంలో అగ్నిప్రమాదం.
మదనపల్లి పట్టణం నీరుగట్టుపల్లిలో సోమవారం హ్యాండ్లూమ్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. శివరాత్రి...
By Pagadala Venkateswar 2026-02-17 05:21:50 0 162
Andhra Pradesh
International drugs gang secret revealed
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.   రూ.1.06 కోట్ల విలువైన 213 కేజీల గంజాయి పట్టివేత....
By G k Nookala 2026-06-17 08:45:39 0 120
Telangana
మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి తాలూకా తలకొండపల్లి గ్రామపంచాయతి బద్నాపూర్ గ్రామం లో తోటపల్లి జంగయ్య...
By MERIGE MALLESH 2026-03-26 05:36:46 0 356
Telangana
మున్సిపాల్ కమీషనర్ కి వినతి పత్రం ఇచ్చిన సీఐటీయూ నాయకులు
మంచిర్యాల :సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం రోజున క్యాతనపల్లి మున్సిపల్టిలో పనిచేస్తున్న మున్సిపాలిటీ...
By Avunoori Mahesh 2026-04-23 14:34:27 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com