Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన.

0
112

 

 

Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన

11-02-2026 Andhra

Pawan Kalyan Warns TDP Janasena BJP to Be Vigilant Against YSR Congress

చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం

వైసీపీ కుట్రల పట్ల టీడీపీ, జనసేన, బీజేపీ అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచన

హిందూమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని వైసీపీ చూస్తోందని ఆరోపణ

 

వైసీపీపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగిస్తుండగా 11 నిమిషాల పాటు నిరసన తెలిపి వాకౌట్ చేశారు.

 

అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కమిటీ హాలులో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, వైసీపీ కుట్రల పట్ల కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

వైసీపీ హిందూమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ హిందూమతాన్ని గౌరవిస్తారని అన్నారు. మన ప్రభుత్వంపై జగన్, ఆయన పార్టీ చేసే కుట్రలను గుర్తించాలని అన్నారు.

 

అనంతరం, పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, సభలో ఎంతసేపు మాట్లాడామనే దానికంటే అవసరమైన విషయం ఎంత మాట్లాడామనేది ముఖ్యమని అన్నారు. దావోస్‌లో ముఖ్యమంత్రి, తాను ప్రతి సంస్థపై ముందస్తుగా కసరత్తు చేసినట్లు చెప్పారు. అందుకే తమను కలిసిన ప్రతి సంస్థకు ముఖ్యమంత్రి క్లుప్తంగా ఏడు నిమిషాల్లోనే విషయం చెప్పి ముగించేవారని గుర్తు చేసుకున్నారు. అందుకే తక్కువ సమయంలో ఎక్కువమంది పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి కలవగలిగారని అన్నారు. శాసనసభలో కూడా సభ్యులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బర్త్ సర్టిఫికేట్ జారీలో అలసత్వం తగదు
వృద్ధులకు బర్త్ సర్టిఫికేట్ జారీలో అలసత్వం తగదని జన జాగృతి ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీరపు...
By Boiena Rajesh 2026-04-02 05:16:07 0 142
Andhra Pradesh
జింక అడ్డొచ్చి ప్రమాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెలకు గాయాలు.
మదనపల్లె టౌన్ పరిధిలో సోమవారం జరిగిన ఘటనలో, ములకలచెరువు మండలం తుమ్మనగుట్టకు చెందిన భారతి (35) తన...
By Pagadala Venkateswar 2026-04-27 06:07:40 0 60
Telangana
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ :   ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు...
By Sidhu Maroju 2025-09-12 07:33:38 0 277
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com