Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన.

0
82

 

 

Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన

11-02-2026 Andhra

Pawan Kalyan Warns TDP Janasena BJP to Be Vigilant Against YSR Congress

చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం

వైసీపీ కుట్రల పట్ల టీడీపీ, జనసేన, బీజేపీ అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచన

హిందూమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని వైసీపీ చూస్తోందని ఆరోపణ

 

వైసీపీపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగిస్తుండగా 11 నిమిషాల పాటు నిరసన తెలిపి వాకౌట్ చేశారు.

 

అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కమిటీ హాలులో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, వైసీపీ కుట్రల పట్ల కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

వైసీపీ హిందూమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ హిందూమతాన్ని గౌరవిస్తారని అన్నారు. మన ప్రభుత్వంపై జగన్, ఆయన పార్టీ చేసే కుట్రలను గుర్తించాలని అన్నారు.

 

అనంతరం, పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, సభలో ఎంతసేపు మాట్లాడామనే దానికంటే అవసరమైన విషయం ఎంత మాట్లాడామనేది ముఖ్యమని అన్నారు. దావోస్‌లో ముఖ్యమంత్రి, తాను ప్రతి సంస్థపై ముందస్తుగా కసరత్తు చేసినట్లు చెప్పారు. అందుకే తమను కలిసిన ప్రతి సంస్థకు ముఖ్యమంత్రి క్లుప్తంగా ఏడు నిమిషాల్లోనే విషయం చెప్పి ముగించేవారని గుర్తు చేసుకున్నారు. అందుకే తక్కువ సమయంలో ఎక్కువమంది పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి కలవగలిగారని అన్నారు. శాసనసభలో కూడా సభ్యులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన SP.
అన్నమయ్య జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ ధీరజ్ "శ్రీ పరాభవ" నామ ఉగాది మరియు పవిత్ర రంజాన్ పండుగ...
By Pagadala Venkateswar 2026-03-20 03:42:48 0 99
Telangana
ఘనంగా ప్రధానమంత్రి జయంతి వేడుకలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఆయన...
By Sidhu Maroju 2025-09-17 15:47:17 0 236
Andhra Pradesh
మదనపల్లె ఆసుపత్రిలో మందుల కొరత.. ఎమ్మెల్యే షాజహాన్ ఆగ్రహం.
శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన పత్రికా సమావేశంలో, ఎమ్మెల్యే...
By Pagadala Venkateswar 2026-03-20 11:49:04 0 105
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com