అంజుమన్‌ భూములను ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయం ఎదుట గుంటూరు వైఎస్సార సీపి నాయకులు «నిరసన వ్యక్తం చేశారు.

0
163

గుంటూరు జిల్లా మంగళగిరి చిన కాకానిలోని 71.5 ఎకరాల అంజుమన్‌ భూమిని ప్రైవేటీకరణను తక్షణమే విరమించుకోవాలని కోరుతూ మంగళవారం విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయం వద్ద గుంటూరు వైఎస్సార్‌ సీపి నాయకులు కార్యాలయం ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంజుమన్‌ హమారా.. హక్‌ హమారా అంటూ నినాదాల హోరెత్తించారు. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలంయలో బోర్డు సమావేశం జరుగుతున్న నేపథ్యంలో బోర్డు గుంటూరు అంజుమన్‌ భూమికి సంబంధించి 71.5 ఎకరాల భూమికి సంబంధించి ఐటీ పార్క్‌ నిర్మాణంకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ ధర్నా నిర్వహించారు. వక్ఫ్‌ బోర్డు సమావేశం అనంతరం బయటకు వచ్చిన గుంటూరు అంజుమన్‌ అధ్యక్షుడు, వక్ఫ్‌బోర్డు డైరెక్టర్, గుంటూరు తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే నసీర్‌ అహమ్మద్‌ వైఎస్సార్‌ సీపి నాయకులు అడ్డగించి బోర్డు సమావేశంలో ఏమి తెల్చారో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. మరలా అఖిల పక్ష సమావేశం నిర్వహించి చెబుతానంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఈ సంధర్భంగా వైఎస్సార్‌ సీపి రాష్ట్ర కార్యదర్శి, షేక్‌ గులాం రసూల్‌ తూర్పు నియోజక వర్గ ఇన్‌చార్జి నూరీ ఫాతిమా, ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ నాయకులు, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర కోశాధికారి అబ్దుల్ కలాం మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు సద్దాం ఖాన్, మహమ్మద్ ఆయాజ్ , సయ్యద్ సర్తాజ్ అహ్మద్, నసీమా, మరియు గుంటూరు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ భాయ్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం , నూర్ ఖాన్,రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయం ముందు జరిగిన ధర్మ లో తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం శ్రీశైలం వెళ్లేవారికి అన్నదానం కార్యక్రమం చేస్తున్న టిడిపి రవీంద్ర వర్గం
డాక్టర్ మన్నే రవీంద్ర మాజీ టెక్నాలజీ చైర్మన్ వడ్లమూరి లింగన్న మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ...
By Chennaiah Kati 2026-02-14 14:58:24 0 204
Telangana
పేసా చట్టాన్ని బలోపేతం చేయాలి
కొత్తగూడ,డిసెంబర్ 24(భారత్ అవాజ్)::పేసా చట్టం మహోత్సవన్ని పురస్కరించుకొని ఆదివాసీ ప్రజా సంఘాల...
By Bittu Bittu 2025-12-24 13:59:21 0 315
Andhra Pradesh
డ్రగ్స్కు కు నో చెప్పేలా పిల్లలను తీర్చి ఇద్దాలి సిఐ
నిమ్మనపల్లె సీఐ రవినాయక్ తల్లిదండ్రులకు సూచించారు. మంగళవారం రెడ్డివారిపల్లిలో పోలీసులు, శక్తి...
By Pagadala Venkateswar 2026-01-15 07:49:03 0 132
Andhra Pradesh
ఆర్టీసీ గుడ్ న్యూస్.. కొరియర్స్, పార్సిల్స్ డోర్ డెలివరీ ఫ్రీ, ఎన్ని కిలోమీటర్ల వరకంటే..?
ఏపీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు డిసెంబర్ 20 నుంచి నెల రోజుల పాటు...
By John Baji 2025-12-31 01:34:53 0 107
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com