జీహెచ్ఎంసీకి రికార్డు ఆదాయం.. రూ.1,172 కోట్లు!

0
188

హైదరాబాద్: 2025-26 ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆదాయం గణనీయంగా పెరిగింది. నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా మొత్తం రూ.1,172.08 కోట్ల ఆదాయం సమకూరినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.

గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,138.44 కోట్ల ఆదాయం నమోదు కాగా, ఈసారి అదనంగా రూ.34.36 కోట్ల వృద్ధి నమోదైంది. ముఖ్యంగా ‘బిల్డ్ నౌ’ పోర్టల్ ద్వారా అనుమతులు, సర్టిఫికెట్లు జారీ చేయడం ఆదాయం పెరగడానికి దోహదపడింది.

2025 మార్చి నెలలోనే 15,536 నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతులు మంజూరు చేయడం గమనార్హం. నగర అభివృద్ధి వేగం పెరుగుతున్న దానికి ఇది స్పష్టమైన సంకేతంగా అధికారులు పేర్కొన్నారు.

అదే సమయంలో క్యూర్ అర్బన్ రీజియన్‌లో ఆస్తి పన్ను వసూళ్లు కూడా భారీగా నమోదయ్యాయి. మొత్తం రూ.2,558.8 కోట్ల పన్ను వసూలు కాగా, జీహెచ్ఎంసీలో రూ.995.82 కోట్లు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.100.36 కోట్లు, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.562.62 కోట్లు వసూలయ్యాయి.

మార్చి నెలలోనే రూ.453 కోట్ల బకాయిలు వసూలు చేయగా, మార్చి 31 ఒక్కరోజే రూ.162.94 కోట్ల ఆదాయం నమోదు కావడం విశేషం. ఈ వసూళ్లు నగర ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తున్నాయి.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
యువ శక్తే మన బలం.. టెక్నాలజీయే మన ఆయుధం నేడు మాన్ కీ బాత్ లో ప్రధాన మంత్రి మోడీ
ప్రధానమంత్రినరేంద్రమోడీ నేడు నిర్వహించన 129వ మాన్ కీ బాత్ కార్యక్రమం లో దేశ ప్రజలు ను ఉద్దేశించి...
By Karapati Gopi 2025-12-28 10:02:43 0 300
Andhra Pradesh
సారస్ జాతీయ స్థాయి కార్యక్రమం
 సారస్ (SARAS) జాతీయ స్థాయి ప్రదర్శన జనవరి 6 నుంచి 18 వరకు గుంటూరులో జరుగుతుందని జిల్లా...
By John Baji 2026-01-02 08:35:33 0 137
Andhra Pradesh
బైక్ పై నుంచి పడి కోమాలోకి వెళ్లిన సచివాలయ ఉద్యోగి
రొంపిచర్ల మండలం పెద్దమల్లెల గ్రామ సచివాలయంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న...
By Kothuru Murali 2026-03-17 07:09:50 0 122
Andhra Pradesh
పుంగనూరు: వారిపై వెంటనే చర్యలు
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులపై హింసను...
By Kothuru Murali 2026-04-14 03:58:45 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com