డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 8 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా

0
49

చీరాల: చీరాల ఒకటో పట్టణ ట్రాఫిక్ ఇంచార్జి ఎస్సై పవన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురిని పోలీసులు గుర్తించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వాళ్లని చీరాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులను పరిశీలించిన మెజిస్ట్రేట్, నిబంధనలను ఉల్లంఘించిన ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు.

ఈ సందర్భంగా, ఎస్ఐ, పవన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజల ప్రాణాల భద్రత కోసమే ఇటువంటి తనిఖీలు కఠినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడే వాళ్లపై ఇకపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజలు తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలంటే ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పెన్షన్ డబ్బు దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్ తప్పదు: డిపిఎం.
అన్నమయ్య జిల్లా డీపీఎం ధర్మరాజు పెన్షన్ డబ్బును లబ్ధిదారులకు ఇవ్వకుండా పన్నులు లేదా ఇతర అవసరాలకు...
By Pagadala Venkateswar 2026-01-23 06:56:37 0 60
Andhra Pradesh
ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్
కర్నూలు :  వీధి దీపాల మరమ్మతులను ఆలస్యం చేయొద్దు• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-06 00:00:04 0 110
Andhra Pradesh
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి...
By Kothuru Murali 2026-01-07 12:48:45 0 58
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com