డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 8 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా

0
114

చీరాల: చీరాల ఒకటో పట్టణ ట్రాఫిక్ ఇంచార్జి ఎస్సై పవన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురిని పోలీసులు గుర్తించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వాళ్లని చీరాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులను పరిశీలించిన మెజిస్ట్రేట్, నిబంధనలను ఉల్లంఘించిన ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు.

ఈ సందర్భంగా, ఎస్ఐ, పవన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజల ప్రాణాల భద్రత కోసమే ఇటువంటి తనిఖీలు కఠినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడే వాళ్లపై ఇకపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజలు తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలంటే ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
ఊరు ఊర అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
27-032026ఊరు ఊర అంగరంగవైభవంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ...
By MERIGE MALLESH 2026-03-27 11:19:09 0 122
Andhra Pradesh
కార్మికుల శ్రమతోనే నగరానికి గుర్తింపు : కమిషనర్
కర్నూలు సిటీ : కర్నూలు :  కార్మికుల శ్రమతో నగరానికి ప్రత్యేక గుర్తింపు• నగరపాలక సంస్థ...
By Hari Krishna 2026-01-09 11:19:51 0 174
Andhra Pradesh
ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక !! 108 పిర్యాదులు !!
కర్నూలు :  పత్రికా ప్రకటన … (15.12.2025) కర్నూలు జిల్లా...విచారణ జరిపి...
By Hari Krishna 2025-12-15 12:03:37 0 190
Andhra Pradesh
శ్రీకృష్ణదేవరాయలు విగ్రహావిష్కరణలు పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు నంబరు పూలు కుంటలోని తిమ్మమ్మ మర్రిమాను దగ్గర శ్రీకృష్ణదేవరాయలు విగ్రహావిష్కరణలు పాల్గొన్న...
By Benguluri Madhubabu 2026-02-07 08:43:01 0 207
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com