"శ్రీగణేష్ ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్.|

0
124

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు పడింది.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం మోండా డివిజన్ పరిధిలోని వెస్ట్ మారేడ్‌పల్లిలో సాయి సాత్విక్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్”ను అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా బలపరచడం కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు.

మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తుందని, స్వయం ఉపాధి అవకాశాల ద్వారా మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దే దిశగా కృషి కొనసాగుతుందని తెలిపారు. కోటి మంది మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేసి కోటీశ్వరులుగా మార్చడమే ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

క్యాంటిన్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసిన మహిళా సంఘ సభ్యులను ఎమ్మెల్యే అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ప్రాంతాల్లో విస్తరించాలని ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో బోయిన్‌పల్లి సర్కిల్ డీసీ డాకూనాయక్, మెప్మా కోఆర్డినేటర్ యాదయ్య, అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుధాకర్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సంతోష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, వైష్ణవి యాదవ్, ధనలక్ష్మి, శేఖర్ ముదిరాజ్, శ్రీనాథ్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
దివ్యాంగుల కోసం బీజేపీ నాయకులు విన్నపాలు
పుట్టే ప్రతి పౌరుడి కి జీవించే హక్కు. అడిగే హక్కు . సద్విని యోగం చేసుకొనే హక్కు భారత రాజ్యాంగం...
By Mobbu Venkatramana 2026-02-02 12:12:46 0 408
Andhra Pradesh
పేదల పొట్ట కొట్టే చర్యలను సహించం: కాంగ్రెస్
పుంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మురళీ మోహన్ యాదవ్ ఆదివారం మదనపల్లెలో మాట్లాడుతూ,...
By Kothuru Murali 2026-01-11 13:09:09 0 132
Andhra Pradesh
Andhra Pradesh Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం
Free Bus Scheme : తెలుగు రాష్ట్రాల మహిళలు ప్రస్తుతం ఎలాంటి ఖర్చు లేకుండానే ఆర్టిసి బస్సుల్లో...
By Pagadala Venkateswar 2026-01-08 10:50:29 0 400
Andhra Pradesh
రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ.
ఏపీలో 14 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ మరియు పోస్టింగ్స్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు...
By John Baji 2026-01-12 13:49:09 0 163
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది : ధర్మవరం సుబ్బారెడ్డి
కర్నూలు : 2025 కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేరుస్తూ, రాష్ట్రం అభివృద్ధి...
By Hari Krishna 2025-12-30 16:25:52 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com