ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను జయప్రదం చేయండి

0
128

*ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను జయప్రదం చేయండి* 

 

 *సమ్మె జయప్రదం కొరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన గుంటూరుజిల్లా జీపు జాత శుక్రవారం నాడు రాజధాని లోని ఎర్రబాలెం వచ్చిన సందర్భంగా స్వాగతం పలుకుతున్న సిఐటియు నేతలు, మున్సిపల్ కార్మికులు*

*

*రాజధాని లోని ఎర్రబాలెంలో మాట్లాడుతున్న* *సిఐటియు గుంటూరు జిల్లా కార్యదర్శి* 

*జి. రమణ*

 

*లేబర్ కోడులను రద్దు చేయాలి*

 

*సిఐటియు గుంటూరు జిల్లా కార్యదర్శి* 

*జి.రమణ డిమాండ్* 

*

ఈ సందర్భంగా సిఐటియు రాజధాని డివిజన్ నాయకులు ఎం రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు గుంటూరు జిల్లా కార్యదర్శి జి. రమణ మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని అన్నారు 

 

స్వతంత్రం వచ్చిన నాటినుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను తొలగించి వాటి స్థానంలో కార్పొరేట్లకు వత్తాసుగా నాలుగు లేబర్ కోడులను తీసుకువచ్చిందని 

ఇవి అమలు జరిగితే కార్మికులు కట్టు బానిసలుగా మారతారని సాధించుకున్న హక్కులన్నీ కోల్పోతారని అన్నారు 

 

కార్మిక వర్గానికి ఉరి తాళ్లుగా మారే లేబర్ కోడులను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తక్షణం ఉపసంహరించు

కోవాలని రమణ డిమాండ్ చేశారు 

 

కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు 

 

రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పని గంటల పెంపు, మహిళలతో రాత్రిపూట డ్యూటీలు చేపించాలనె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు 

 

కార్మిక వ్యతిరేక విధానాలను పాలకులు విడనాడకపోతే కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని రమణ హెచ్చరించారు 

 

ఏఐటి యుసి గుంటూరు జిల్లా అధ్యక్షులు

 ఏ అరుణ్ కుమార్ మాట్లాడుతూ 

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని కోరారు 

 

ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు

 

ఈ కార్యక్రమంలో సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్షులు 

బి లక్ష్మణరావు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాజధాని ప్రాంత నాయకులు ఆదిలక్ష్మి ఎం పార్వతి చిన్న శ్రీను కొండలు శ్రీలక్ష్మి రమాదేవి ఎస్కే సుభాని గాంధీ కోటేశ్వరరావు తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి అవసరం: జేసీ.
మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది....
By Pagadala Venkateswar 2026-03-31 03:34:26 0 117
Andhra Pradesh
పుంగనూరు: వ్యక్తిని డిమాండ్ తరలించిన పోలీసులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో చౌక దుకాణానికి వెళ్తున్న మైనర్ బాలికను ఆటోలో ఎక్కించుకొని అటవీ...
By Kothuru Murali 2026-04-11 06:20:30 0 73
Rajasthan
Rajasthan Players Shine at World University Games in Germany
Seven talented Rajasthan basketball players have been selected for Team India at the FISU World...
By Bharat Aawaz 2025-07-17 07:40:42 0 1K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:చౌడేపల్లి మండలంలో అగ్నిప్రమాదం
పుంగునూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కాన్ సాహెబ్ మిట్ట వద్ద శనివారం అగ్నిప్రమాదం సంభవించింది....
By Kothuru Murali 2026-03-15 10:11:18 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com