మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ అడ్మిషన్ల సందడి
సూర్యమోహన్, మద్దూరు మండలం రిపోర్టర్
మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ అడ్మిషన్ల సందడి
కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దోస్త్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.ఈ నెల 15న మొదలైన దరఖాస్తుల గడువు మే7వరకు కొనసాగుతుందని ప్రిన్సిపల్ బి కృష్ణారెడ్డి తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.కళాశాలలో బీఏ, బీకామ్,బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ (ఎంపీసీఎస్,బీజెడ్సీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు,ప్రభుత్వ స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు మీ-సేవా కేంద్రాల ద్వారా లేదా దోస్త్ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇతర వివరాలకు కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని కళాశాల ప్రిన్సిపాల్ సూచించారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz