ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

0
91

*ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి*

 

*సమ్మెకు సన్నాహంగా గురువారం నాడు *ఉండవల్లిలో జరిగిన మున్సిపల్ కార్మికుల సమావేశం* 

 

*12న ఉండవల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన*

 

*సమ్మె కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న కార్మికులు* 

 

*లేబర్ కోడులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మున్సిపల్ కార్మికులు*

 

*సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న సిఐటియు రాజధాని డివిజన్ నాయకులు ఎం రవి* 

*

రవి మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వినాశకర విధానాలను అవలంబిస్తుందని అన్నారు 

 

 లేబర్ 

కో డులు, నల్ల చట్టాలు కార్పొరేట్ల మెప్పుకోసం తీసుకువచ్చిందని విమర్శించారు 

 

ఈ విధానాల వలన కార్మికులు కట్టు బానిసలుగా మారతారని, రైతాంగం పంటలకు గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయ రంగం దివాలా తీసి రైతులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు 

 

కార్మిక ,రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను ఎన్డీఏ ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేస్తూ 

కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కార్మిక వర్గం సిద్ధం అవుతుందని అన్నారు

 

కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని రవి డిమాండ్ చేశారు 

 

గత జులై నెలలో మున్సిపల్ కార్మికుల సమ్మె కాలపు వేతనాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చి ఈరోజు వరకు చెల్లించలేదని వెంటనే సమ్మె కాలపు వేతనాన్ని చెల్లించాలని కోరారు

 

 మున్సిపల్ కార్మికుల రిటైర్మెంట్ ను 

62 సంవత్సరాల కు పొడిగించాలని, 

రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యూటీ,హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్నారు 

 

12వ పిఆర్సి అమలు జరపాలని కోరారు

 

 ఎం బుక్ కార్మికులకు, డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు

 

12వ తేదీ ఉండవల్లిలో జరిగే కార్మిక ప్రదర్శనలో కార్మికులు తమ కుటుంబాలతో సహా పాల్గొనాలని రవి కోరారు

 

 ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు 

ఏ శాంత కుమారి 

ఏ నారాయణ 

ఎం స్వర్ణకుమారి కుశాలరావ్ కే మేరీ సుబ్బులు స్వరూప శ్రావణి ప్రజాసంఘాల నాయకులు ఈమని రామారావు వల్లభాపురం వెంకటేశ్వరరావు ఎస్ ఇమ్మానియేల్ రాజు ఉండవల్లి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మరువలేము- చీరాల వాకర్స్ అసోసియేషన్
చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుడు,గాంధేయవాది,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Vadlamudi NagaVenkat 2026-03-16 12:37:14 0 551
Andhra Pradesh
విద్యార్థినికి బెదిరింపు
విశాఖ పట్నంలోని రామనగర్ నందు గల సెవెన్ హిల్స్ నర్సింగ్ స్కూల్ యజ మాన్యం తన స్కూల్ లో నర్సింగ్...
By Mobbu Venkatramana 2026-03-19 12:06:29 0 154
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : 9 మంది పేకాట రాయుళ్లపై కేసు నమోదు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది జూదరులను ఎస్సై...
By Kothuru Murali 2026-02-15 07:14:38 0 89
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com