APPSC గ్రూప్–1 మరియు గ్రూప్–2 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన పోలీస్ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

0
206

APPSC గ్రూప్–1 మరియు గ్రూప్–2 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన పోలీస్ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో ఎఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న హుస్సేన్ గారి కుమార్తె రిజ్వానా APPSC గ్రూప్–1 ఫలితాలలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. అదేవిధంగా APPSC గ్రూప్–2 ఫలితాలలో స్పెషల్ పార్టీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు కె.అశోక్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్‌గా, కె.వెంకటేశ్వర్లు మరియు కె. సూర్య తేజలు ఎక్సైజ్ సబ్–ఇన్‌స్పెక్టర్లుగా ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జిల్లా ఎస్పీ గారు వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపి బహుమతి లు అందజేశారు

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, ఇదే పట్టుదల, క్రమశిక్షణ, కఠోర కృషితో భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. దృఢ సంకల్పం, సరైన ప్రణాళిక, సమయ పాలనతో పాటు నిరంతర అధ్యయనం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. APPSC గ్రూప్–1 మరియు గ్రూప్–2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన తల్లిదండ్రులను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది తమ పిల్లలకు క్రమశిక్షణ, నైతిక విలువలు, సరైన మార్గదర్శనం అందిస్తూ చదువులో ప్రోత్సహించాలని సూచించారు. అలా చేస్తే వారు ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమం లోఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఆర్ఐ లు రమణారెడ్డి, సీతారామరెడ్డి మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
రాజాపేట మండల టియూజేఏసీ అధ్యక్షురాలిగా ఎడ్ల బాలక్ష్మి
రాజాపేట జూన్ 06 భారత్ ఆవాజ్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి...
By Pindikura Mahesh 2026-06-07 08:09:55 0 102
Andhra Pradesh
మదనపల్లి: రైతులకు లక్షల్లో మోసం… ఎస్పీకి ఫిర్యాదు.
మదనపల్లెలో రైతులను లక్షల్లో మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా ఎస్పీకి...
By Pagadala Venkateswar 2026-04-21 03:12:24 0 93
Andhra Pradesh
ఆగిరిపల్లి పోతవరప్పాడు లో పేకాట శిబిరంపై పోలీసుల ఆకస్మిక దాడులు
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులో పేకాట శిబిరంపై పోలీసుల ఆకస్మిక దాడులు...  ...
By Rajini Kumari 2025-12-22 08:08:29 2 965
Andhra Pradesh
అంగరంగ వైభవంగా జగన్నాథ స్వామి రథయాత్ర
బొబ్బిలి పట్టణంలో శుక్రవారం జగన్నాధస్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. కంచరవీధిలో ఉన్న...
By Boiena Rajesh 2026-07-24 05:24:03 0 21
Andhra Pradesh
Chandrababu Naidu: కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ వ్యూహం.. ఏపీకి నిధులు రాబట్టాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ ఏపీకి అత్యధిక నిధులు రాబట్టాలని...
By Pagadala Venkateswar 2026-01-26 06:46:07 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com