Ambati Rambabu: చంద్రబాబుపై వ్యాఖ్యల పట్ల అంబటి రాంబాబు బాధపడుతున్నారు: అల్లుడు ఉపేష్.

0
79

జైల్లో మామ అంబటిని కలిసిన అల్లుడు ఉపేష్

ఆవేశంలో అంబటి నోరు జారారని వ్యాఖ్య

 

అంబటికి సినిమా చూపిస్తామని పెమ్మసాని అనడం కరెక్ట్ కాదన్న ఉపేష్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు పశ్చాత్తాపం చెందుతున్నారని ఆయన అల్లుడు ఉపేష్ తెలిపారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న అంబటిని సోమవారం మధ్యాహ్నం ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

టీడీపీ శ్రేణులే ముందుగా రెచ్చగొట్టేలా ప్రవర్తించారని, ఆ ఒత్తిడిలో అంబటి మాట జారారని ఉపేష్ ఆరోపించారు. సీఎంపై అసభ్యంగా మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ, దాడులు చేయడం సరికాదన్నారు. అంబటికి సినిమా చూపిస్తామంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

 

గుంటూరులోని తమ ఇంటిపై పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త, అనుచరులు కలిసి దాడి చేశారని ఉపేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో నమోదైందని, వాటి ఆధారంగా నిందితులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. "ఏ పార్టీ కూడా ఎల్లప్పుడూ అధికారంలో ఉండదనే విషయం గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలే పునరావృతం కావొచ్చు" అని ఆయన హెచ్చరించారు.

 

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయగా, గుంటూరు కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. మరోవైపు, అంబటి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడానికే తాను వెళ్లానని, దాడిని ప్రోత్సహించలేదని ఎమ్మెల్యే గల్లా మాధవి ఇప్పటికే వివరణ ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ_నగర కమిషనర్ పులి శ్రీనివాసులు.
గుంటూరు నగరంలో మైక్రో ప్యాకెట్స్ వారీగా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్...
By John Baji 2025-12-31 01:48:17 0 109
Telangana
సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
కొత్తగూడ, డిసెంబర్ 14(భారత్ అవాజ్): స్థానికల ఎన్నికలవేళ కొత్తగూడ మండలలో జోరుగా ఎన్నికల ప్రచారం...
By Bittu Bittu 2025-12-14 04:57:30 0 460
Telangana
సామాన్య ప్రజలకు హక్కులు అందించిన మన రాజ్యాంగం- ప్రొఫెసర్ కోదండరాం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : దేశ సామాన్య ప్రజలకు హక్కులు అందించినది మన రాజ్యాంగమని మాజీ శాసన...
By Sidhu Maroju 2025-11-26 15:38:01 0 126
Andhra Pradesh
మదనపల్లి: సమిష్టి కృషితో జలధార విజయం – కలెక్టర్.
మంగళవారం మదనపల్లిలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, జలధార ప్రాజెక్టు...
By Pagadala Venkateswar 2026-04-01 04:49:40 0 55
Andhra Pradesh
ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం
గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని,...
By John Baji 2025-12-30 01:40:24 0 136
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com