ఏపీ ప్రజలకు శుభవార్త.. 25 సేవలు ఇంటి నుంచే, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.

0
301

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా సేవల్ని సులభతరం చేస్తోంది. మొత్తం 25 సేవల్ని ఒక క్లిక్ దూరంలో పురపాలక శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆస్తి పన్ను చెల్లింపులు, ట్రేడ్ లైసెన్స్, మ్యుటేషన్, మ్యారేజ్ సర్టిఫికేట్ వంటి పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు వారికి అవసరమైన సేవల్ని ఎంచుకుని వివరాలు ఎంటర్ చేస్తే కమిషనర్ లాగిన్‌కు వెళతాయి.. ఆ వివరాలు పరిశీలించిన తర్వాత నిర్ణీత గడువులోగా సేవలు అందుతాయి. ఏపీ ప్రభుత్వం మున్సిపల్‌శాఖ పోర్టల్‌ను అప్డేట్ చేసింది.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటుగా, సేవలు ఆలస్యం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు చాలా సులువుగా ఈ సేవలు పొందొచ్చు.

ఏపీ ప్రభుత్వం మున్సిపల్‌శాఖ పోర్టల్ ద్వారా అందించే సేవలకు సంబంధించి ఒక గడువు కూడా ఉంటుంది. ఎవరైనా ఇంటి పన్నుకు సంబంధించి 15 రోజులు, ట్రేడ్ లైసెన్స్‌కు 7 రోజులు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌తో పాటు సర్టిపికెట్ జారీకి మూడు రోజుల గడువు ఉంటుంది. ఇలా ఈ పోర్టల్ ద్వారా అందించే 25 రకాల సేవలు ఎన్ని రోజుల్లో అందించాలో క్లియర్‌గా ఉంటుంది. ఒకవేళ ఈ గడువులోగా సేవలు అందించకపోయినా, ఆలస్యం చేసినా, దరఖాస్తును తిరస్కరించినా సరే దీనికి సంబంధించి కారణాలను దరఖాస్తు చేసుకున్నవారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ కారణం లేకుండా ఆలస్యం చేసినట్లు తేలితే సంబంధిత ఉద్యోగులతో పాటుగా అధికారుల్ని బాధ్యుల్ని చేస్తారు.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

ప్రజలు ఈ మున్సిపల్‌శాఖ పోర్టల్ ద్వారా పొందే సేవలకు సంబంధించిన ఫీజుల్ని నగదు రహిత చెల్లింపులు చేయొచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఫీజులు చెల్లించే అవకాశం కల్పించారు. ప్రజలు పొందే ఈ సేవలకు సంబంధించి ఫీజుల వివరాలను కూడా పోర్టల్‌లో ఉంచారు. ఇంటి ఆస్తి పన్నుకు సంబంధించి స్థలం కొలతలు నమోదు చేయగానే ఫీజుల వివరాలు ఆటోమెటిక్‌గా వస్తాయి. ప్రజలు పురపాలకశాఖ వెబ్‌సైట్‌ cdma.ap.gov.in ద్వారా ఈ సేవల్ని పొందొచ్చు. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే.. అక్కడ 'ఫింగర్‌ టిప్స్‌లో మున్సిపల్‌ సేవలు' అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆన్‌లైన్‌లో అందించే పౌర సేవలకు సంబంధించిన వివరాలు కూడా కనిపిస్తాయి. అక్కడ అవసరమైన సేవపై క్లిక్ చేసి.. నగరం, పట్టణాన్ని సెలక్ట్ చేసి అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలు మున్సిపల్ కమిషనర్‌ లాగిన్‌కు వెళతాయి.. ఆ తర్వాత ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రజలు ఈ సేవల్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మాఘ శుద్ధ విదియ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారి...
బాపట్ల: మాఘ శుద్ధ విదియ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని...
By Gadiyapudi Narendra 2026-01-20 12:27:21 0 178
Telangana
*🔊తెలంగాణలో మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ విడుదల*
*🔊తెలంగాణలో మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ విడుదల*   *🍥హైదరాబాద్‌:...
By Vanmoj Suryamohan 2026-01-16 16:27:43 0 437
Andhra Pradesh
మదనపల్లిలో ఆటోలపై స్పెషల్ డ్రైవ్.
మదనపల్లి జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి అశోక్ ప్రతాప్ రావు ఆధ్వర్యంలో అమ్మ చెరువు మిట్ట వద్ద...
By Pagadala Venkateswar 2026-02-28 07:24:48 0 108
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో యాచకుడి మృతి
పుంగనూరు పట్టణంలో రోడ్లపై యాచించుకుంటూ జీవనం సాగిస్తున్న దిలావర్ (65) నాగపాళ్యంలో ఒక షాపు వద్ద...
By Kothuru Murali 2026-02-03 09:30:07 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com