ఏపీ ప్రజలకు శుభవార్త.. 25 సేవలు ఇంటి నుంచే, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.

0
451

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా సేవల్ని సులభతరం చేస్తోంది. మొత్తం 25 సేవల్ని ఒక క్లిక్ దూరంలో పురపాలక శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆస్తి పన్ను చెల్లింపులు, ట్రేడ్ లైసెన్స్, మ్యుటేషన్, మ్యారేజ్ సర్టిఫికేట్ వంటి పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు వారికి అవసరమైన సేవల్ని ఎంచుకుని వివరాలు ఎంటర్ చేస్తే కమిషనర్ లాగిన్‌కు వెళతాయి.. ఆ వివరాలు పరిశీలించిన తర్వాత నిర్ణీత గడువులోగా సేవలు అందుతాయి. ఏపీ ప్రభుత్వం మున్సిపల్‌శాఖ పోర్టల్‌ను అప్డేట్ చేసింది.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటుగా, సేవలు ఆలస్యం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు చాలా సులువుగా ఈ సేవలు పొందొచ్చు.

ఏపీ ప్రభుత్వం మున్సిపల్‌శాఖ పోర్టల్ ద్వారా అందించే సేవలకు సంబంధించి ఒక గడువు కూడా ఉంటుంది. ఎవరైనా ఇంటి పన్నుకు సంబంధించి 15 రోజులు, ట్రేడ్ లైసెన్స్‌కు 7 రోజులు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌తో పాటు సర్టిపికెట్ జారీకి మూడు రోజుల గడువు ఉంటుంది. ఇలా ఈ పోర్టల్ ద్వారా అందించే 25 రకాల సేవలు ఎన్ని రోజుల్లో అందించాలో క్లియర్‌గా ఉంటుంది. ఒకవేళ ఈ గడువులోగా సేవలు అందించకపోయినా, ఆలస్యం చేసినా, దరఖాస్తును తిరస్కరించినా సరే దీనికి సంబంధించి కారణాలను దరఖాస్తు చేసుకున్నవారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ కారణం లేకుండా ఆలస్యం చేసినట్లు తేలితే సంబంధిత ఉద్యోగులతో పాటుగా అధికారుల్ని బాధ్యుల్ని చేస్తారు.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

ప్రజలు ఈ మున్సిపల్‌శాఖ పోర్టల్ ద్వారా పొందే సేవలకు సంబంధించిన ఫీజుల్ని నగదు రహిత చెల్లింపులు చేయొచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఫీజులు చెల్లించే అవకాశం కల్పించారు. ప్రజలు పొందే ఈ సేవలకు సంబంధించి ఫీజుల వివరాలను కూడా పోర్టల్‌లో ఉంచారు. ఇంటి ఆస్తి పన్నుకు సంబంధించి స్థలం కొలతలు నమోదు చేయగానే ఫీజుల వివరాలు ఆటోమెటిక్‌గా వస్తాయి. ప్రజలు పురపాలకశాఖ వెబ్‌సైట్‌ cdma.ap.gov.in ద్వారా ఈ సేవల్ని పొందొచ్చు. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే.. అక్కడ 'ఫింగర్‌ టిప్స్‌లో మున్సిపల్‌ సేవలు' అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆన్‌లైన్‌లో అందించే పౌర సేవలకు సంబంధించిన వివరాలు కూడా కనిపిస్తాయి. అక్కడ అవసరమైన సేవపై క్లిక్ చేసి.. నగరం, పట్టణాన్ని సెలక్ట్ చేసి అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలు మున్సిపల్ కమిషనర్‌ లాగిన్‌కు వెళతాయి.. ఆ తర్వాత ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రజలు ఈ సేవల్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు.
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-04-11 06:38:45 0 108
Andhra Pradesh
పొన్నేటిపాలెంలో అర్ధరాత్రి వరకు ఎస్‌ఐఆర్ కార్యక్రమం.
మదనపల్లె మండలం పొన్నేటిపాలెం గ్రామంలో టీడీపీ పొన్నేటిపాలెం పంచాయతీ ఇంచార్జ్ బీదం గురునాథ్ యాదవ్...
By Pagadala Venkateswar 2026-07-09 04:49:28 0 58
Andhra Pradesh
Krishna Mohan Reddy: ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీం కోర్టులో నిరాశ.
రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ...
By Pagadala Venkateswar 2026-01-21 14:49:44 0 154
Prop News
From Visibility to Vision: Join the PROPIINN
PROPIINN Is a Real Estate Movement, Not Just a Marketplace Real estate is no longer just about...
By Bharat Aawaz 2025-06-26 05:47:04 0 2K
Andhra Pradesh
Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి: సీఎం చంద్రబాబు.
          Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి:...
By Pagadala Venkateswar 2026-02-02 05:03:38 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com