ఏపీ ప్రజలకు శుభవార్త.. 25 సేవలు ఇంటి నుంచే, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.

0
447

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా సేవల్ని సులభతరం చేస్తోంది. మొత్తం 25 సేవల్ని ఒక క్లిక్ దూరంలో పురపాలక శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆస్తి పన్ను చెల్లింపులు, ట్రేడ్ లైసెన్స్, మ్యుటేషన్, మ్యారేజ్ సర్టిఫికేట్ వంటి పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు వారికి అవసరమైన సేవల్ని ఎంచుకుని వివరాలు ఎంటర్ చేస్తే కమిషనర్ లాగిన్‌కు వెళతాయి.. ఆ వివరాలు పరిశీలించిన తర్వాత నిర్ణీత గడువులోగా సేవలు అందుతాయి. ఏపీ ప్రభుత్వం మున్సిపల్‌శాఖ పోర్టల్‌ను అప్డేట్ చేసింది.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటుగా, సేవలు ఆలస్యం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు చాలా సులువుగా ఈ సేవలు పొందొచ్చు.

ఏపీ ప్రభుత్వం మున్సిపల్‌శాఖ పోర్టల్ ద్వారా అందించే సేవలకు సంబంధించి ఒక గడువు కూడా ఉంటుంది. ఎవరైనా ఇంటి పన్నుకు సంబంధించి 15 రోజులు, ట్రేడ్ లైసెన్స్‌కు 7 రోజులు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌తో పాటు సర్టిపికెట్ జారీకి మూడు రోజుల గడువు ఉంటుంది. ఇలా ఈ పోర్టల్ ద్వారా అందించే 25 రకాల సేవలు ఎన్ని రోజుల్లో అందించాలో క్లియర్‌గా ఉంటుంది. ఒకవేళ ఈ గడువులోగా సేవలు అందించకపోయినా, ఆలస్యం చేసినా, దరఖాస్తును తిరస్కరించినా సరే దీనికి సంబంధించి కారణాలను దరఖాస్తు చేసుకున్నవారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ కారణం లేకుండా ఆలస్యం చేసినట్లు తేలితే సంబంధిత ఉద్యోగులతో పాటుగా అధికారుల్ని బాధ్యుల్ని చేస్తారు.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

ప్రజలు ఈ మున్సిపల్‌శాఖ పోర్టల్ ద్వారా పొందే సేవలకు సంబంధించిన ఫీజుల్ని నగదు రహిత చెల్లింపులు చేయొచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఫీజులు చెల్లించే అవకాశం కల్పించారు. ప్రజలు పొందే ఈ సేవలకు సంబంధించి ఫీజుల వివరాలను కూడా పోర్టల్‌లో ఉంచారు. ఇంటి ఆస్తి పన్నుకు సంబంధించి స్థలం కొలతలు నమోదు చేయగానే ఫీజుల వివరాలు ఆటోమెటిక్‌గా వస్తాయి. ప్రజలు పురపాలకశాఖ వెబ్‌సైట్‌ cdma.ap.gov.in ద్వారా ఈ సేవల్ని పొందొచ్చు. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే.. అక్కడ 'ఫింగర్‌ టిప్స్‌లో మున్సిపల్‌ సేవలు' అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆన్‌లైన్‌లో అందించే పౌర సేవలకు సంబంధించిన వివరాలు కూడా కనిపిస్తాయి. అక్కడ అవసరమైన సేవపై క్లిక్ చేసి.. నగరం, పట్టణాన్ని సెలక్ట్ చేసి అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలు మున్సిపల్ కమిషనర్‌ లాగిన్‌కు వెళతాయి.. ఆ తర్వాత ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రజలు ఈ సేవల్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్‌గా సురేష్ కుమార్ బాధ్యతలు
పుంగనూరు ప్రభుత్వ ఐటీఐకి నూతన ప్రిన్సిపాల్‌గా సి. సురేష్ కుమార్ బుధవారం బాధ్యతలు...
By Kothuru Murali 2026-06-04 14:33:52 0 77
Andhra Pradesh
శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి
పత్రికా ప్రకటన ఇంద్రకీలాద్రి, 19 డిసెంబర్ 2025   ➖ *విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ...
By Rajini Kumari 2025-12-19 10:37:39 0 192
SURAKSHA
Tamil Nadu Police: A Legacy of Technological Pioneering
The Tamil Nadu Police proudly upholds a storied legacy as a trailblazer in Indian law enforcement...
By Lokeshwari Panthadi 2026-07-03 08:58:42 0 45
Telangana
విద్యార్థులను అభినందించిన డీఈవో
విద్యా వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన ఆర్ట్ , క్రాఫ్ట్, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ...
By Nookapangu Manikanta 2026-05-16 10:28:35 0 178
Telangana
నిజామాబాద్
ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ ధర్మపురి  మరియు గౌరవ శాసనసభ్యులు శ్రీ ధన్పాల్...
By Sadaq Sadaq 2026-06-16 05:54:59 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com